Sai Dharam Tej: వివాదంలో మెగా మేనల్లుడు… ఇలా చిక్కుల్లో పడ్డావ్ ఏంటి ‘బ్రో’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న ‘బ్రో’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ మేకర్స్ సెకండ్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘జాణవులే’ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో లాంచ్ చేయనున్నారు. ఈ లవ్ సాంగ్ లాంచ్ కోసం తిరుపతి వెళ్లిన సాయి ధరమ్ తేజ్, ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ రాహుకేతు పూజ చేయడంతో పాటు, స్వామివారిని దర్శించుకున్నాడు.
ఈ క్రమంలో ఉపాలయంలో ఉన్న చంగల్ రాయ స్వామి (సుబ్రమణ్యేశ్వర స్వామి) దగ్గరకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్, వెంటనే అక్కడున్న సిబ్బంది హీరో చేతికి హారతి పల్లెం అందించారు. స్వయంగా సాయితేజ్ చేతుల మీదుగా స్వామివారికి హారతి ఇప్పించారు, దీంతో సమస్య మొదలయ్యింది. ఆలయ నిబంధనల్ని, ఆలయ ఆచారాల్ని అధికారులు, అర్చకులు పట్టించుకోలేదంటూ భక్తుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తిలో కేవలం అర్చకులు మాత్రమే పూజలు చేసి హారతులు ఇవ్వాలని, సామాన్య జనం హారతి ఇవ్వడం నిషిద్దమని తెలిసి కూడా అర్చకులు సాయి ధరమ్ తేజ్ తో హారతి ఎలా ఇప్పించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నుంచి కానీ ఆలయ అర్చకుల నుంచి కానీ ఈ విషయంపై ఎలాంటి స్పందనా లేదు.
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
ఇదిలా ఉంటే ఈ విషయంపై శ్రీకాళహస్తీస్వర ఆలయ పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు సింగిరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. “పెద్దవారు పెట్టిన సాంప్రదాయాలను ఎవరూ మార్చ లేరు, అలాచేస్తే సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడమే. ఆలయాలలో దేవతలు కు పూజలు, అర్చనలకు అభిషేకాలు,హారతులు కు ఒక ఆచారం సాంప్రదాయం అనేది ఉంది. ఎవరంటే వారు వెళ్లి గుడిలోకి వెళ్లి దేవతలకు నైవేద్యాలు పెట్టడం, హారతులు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఇలా ఎవరికి వారు హారతులు ఇస్తే ఇక అర్చకులు ఎందుకు ఉండేది? రాను రాను సాంప్రదాయాలను తుంగలోకి తోక్కుతున్నారు” అంటూ స్పందించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!