Ram Charan: ఆగిన రామ్ చరణ్ ట్రూజెట్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో రామ్ చరణ్ విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులన్నింటిని బుధవారం రాత్రి నుంచి నిలిపివేసింది. 2015లో ట్రూజెట్ ఎయిర్లైన్స్తో ఏవియేషన్ వ్యాపారంలో అడుగుపెట్టాడు రామ్ చరణ్. అయితే ఈ సంస్థకు చెందిన అన్ని విమాలను గత రాత్రి నుంచి గ్రౌండ్ డౌన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ గాను, సాంకేతిక కారణాల వల్ల తమ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకం ఏర్పడిందని త్వరలో పునఃప్రారంభిస్తామని ట్రూజెట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న నష్టాలే అని తేలింది. పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రూజెట్ 2021 ఆర్థిక సంవత్సరానికి రూ. 143 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. 2020లో 10.1 కోట్లు, 2019లో 17.56 కోట్లు నష్టపోయినట్లు చెబుతోందీ సంస్థ.
ఇటీవల ట్రూజెట్ కొత్త సి.ఎఫ్.వోని నియమించింది. గత రెండు నెలలుగా సంస్థ ఉద్యోగులకు పూర్తి జీతాలు కూడా చెల్లించలేదట. ట్రూజెట్ ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా భారత విమానయాన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కామన్ పీపుల్ కూడా విమానయానం చేయటానికి అనువుగా భారత ప్రభుత్వం విమానయాన సంస్థలకు రాయితీలు కల్పించింది. అయినా విమానయాన సంస్థల మనుగడ కష్టంగా మారింది. ఇక కోవిడ్ మహమ్మారి పరిస్థితిని మరింత దిగజార్చింది. ట్రూజెట్ పతనం ఇతర విమానయాన సంస్థలకు ప్రయోజనంగా మారనుంది. పెట్టుబడిదారులతో ట్రూజెట్ చర్చలు విఫలమైతే, ఇండిగో ఎయిర్లైన్స్ ట్రూజెట్ స్లాట్లు, రూట్స్ తో పాటు విమానాలను కూడా తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో!?
Also Read
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!