Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ లో లేని సబ్జెక్ట్ లా వచ్చి భలే అవకాశాలు దక్కించుకుంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి సుశాంత్తో ‘ఇచ్చట వాహనములు నిలుప రాదు’ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడీ’లో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవలేదు. ఆ తరువా ఆమె చేసిన అడివి శేష్ ‘హిట్ 2’ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమా ఆమెకు మంచి అవకాశాలు వచ్చేలా చేసింది. అదే సమయంలో మహేష్, త్రివిక్రమ్ల ‘గుంటూరు కారం’ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడం ఆమె ఫేట్ని మార్చేసింది.
Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
అలా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’తో పాటు విశ్వక్ సేన్తో #VS 10 సినిమా, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమా, వరుణ్ తేజ్తో మట్కా అనే పాన్ ఇండియా సినిమా అలా మొత్తం మీద మూడు సినిమాలు చేస్తోంది. ఈ లైనప్తో ఉన్న మీనాక్షి చౌదరి గురూజీ త్రివిక్రమ్ సెంటిమెంట్ కారణంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. తన సినిమాలో నటించిన హీరోయిన్స్ ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న సెంటిమెంట్. ఇప్పుడు, ఆమె మరో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. అదేమంటే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ప్రచారం మేరకు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో సంయుక్త హెగ్డే మరో కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 15, 2024న విడుదల కానుంది, ఇక మరో పక్క ‘గుంటూరు కారం’ జనవరి 12, 2024న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!