Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ లో లేని సబ్జెక్ట్ లా వచ్చి భలే అవకాశాలు దక్కించుకుంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి సుశాంత్తో ‘ఇచ్చట వాహనములు నిలుప రాదు’ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడీ’లో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవలేదు. ఆ తరువా ఆమె చేసిన అడివి శేష్ ‘హిట్ 2’ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమా ఆమెకు మంచి అవకాశాలు వచ్చేలా చేసింది. అదే సమయంలో మహేష్, త్రివిక్రమ్ల ‘గుంటూరు కారం’ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడం ఆమె ఫేట్ని మార్చేసింది.
Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Idupu Kayitham : 'ఇడుపు కాయితం' చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
- Suhas: "చేతిలో కత్తి.. కళ్లలో కసి!" ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
- Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
అలా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’తో పాటు విశ్వక్ సేన్తో #VS 10 సినిమా, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమా, వరుణ్ తేజ్తో మట్కా అనే పాన్ ఇండియా సినిమా అలా మొత్తం మీద మూడు సినిమాలు చేస్తోంది. ఈ లైనప్తో ఉన్న మీనాక్షి చౌదరి గురూజీ త్రివిక్రమ్ సెంటిమెంట్ కారణంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. తన సినిమాలో నటించిన హీరోయిన్స్ ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న సెంటిమెంట్. ఇప్పుడు, ఆమె మరో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. అదేమంటే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ప్రచారం మేరకు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో సంయుక్త హెగ్డే మరో కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 15, 2024న విడుదల కానుంది, ఇక మరో పక్క ‘గుంటూరు కారం’ జనవరి 12, 2024న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!