Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ లో లేని సబ్జెక్ట్ లా వచ్చి భలే అవకాశాలు దక్కించుకుంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి సుశాంత్తో ‘ఇచ్చట వాహనములు నిలుప రాదు’ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడీ’లో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవలేదు. ఆ తరువా ఆమె చేసిన అడివి శేష్ ‘హిట్ 2’ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమా ఆమెకు మంచి అవకాశాలు వచ్చేలా చేసింది. అదే సమయంలో మహేష్, త్రివిక్రమ్ల ‘గుంటూరు కారం’ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడం ఆమె ఫేట్ని మార్చేసింది.
Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
అలా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’తో పాటు విశ్వక్ సేన్తో #VS 10 సినిమా, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమా, వరుణ్ తేజ్తో మట్కా అనే పాన్ ఇండియా సినిమా అలా మొత్తం మీద మూడు సినిమాలు చేస్తోంది. ఈ లైనప్తో ఉన్న మీనాక్షి చౌదరి గురూజీ త్రివిక్రమ్ సెంటిమెంట్ కారణంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. తన సినిమాలో నటించిన హీరోయిన్స్ ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న సెంటిమెంట్. ఇప్పుడు, ఆమె మరో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. అదేమంటే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ప్రచారం మేరకు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో సంయుక్త హెగ్డే మరో కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 15, 2024న విడుదల కానుంది, ఇక మరో పక్క ‘గుంటూరు కారం’ జనవరి 12, 2024న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!