Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ లో లేని సబ్జెక్ట్ లా వచ్చి భలే అవకాశాలు దక్కించుకుంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి సుశాంత్తో ‘ఇచ్చట వాహనములు నిలుప రాదు’ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడీ’లో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవలేదు. ఆ తరువా ఆమె చేసిన అడివి శేష్ ‘హిట్ 2’ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమా ఆమెకు మంచి అవకాశాలు వచ్చేలా చేసింది. అదే సమయంలో మహేష్, త్రివిక్రమ్ల ‘గుంటూరు కారం’ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడం ఆమె ఫేట్ని మార్చేసింది.
Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అలా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’తో పాటు విశ్వక్ సేన్తో #VS 10 సినిమా, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమా, వరుణ్ తేజ్తో మట్కా అనే పాన్ ఇండియా సినిమా అలా మొత్తం మీద మూడు సినిమాలు చేస్తోంది. ఈ లైనప్తో ఉన్న మీనాక్షి చౌదరి గురూజీ త్రివిక్రమ్ సెంటిమెంట్ కారణంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. తన సినిమాలో నటించిన హీరోయిన్స్ ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న సెంటిమెంట్. ఇప్పుడు, ఆమె మరో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. అదేమంటే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ప్రచారం మేరకు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో సంయుక్త హెగ్డే మరో కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 15, 2024న విడుదల కానుంది, ఇక మరో పక్క ‘గుంటూరు కారం’ జనవరి 12, 2024న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!