Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoor Ali Khan to file a Criminal Defamation cases on Trisha Khushboo Chiranjeevi: స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మన్సూర్ అలీఖాన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్రిషతో తనకు బెడ్ రూమ్ సీన్ ఉంటుందని ఊహించానని గతంలో అనేక మంది హీరోయిన్స్ ని రేప్ చేసినట్టు త్రిషతో కూడా ఒక రేప్ సీన్ పెడతారేమో అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు రకరకాలుగా బయటకు వెళ్లాయి, ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ త్రిష తన సోషల్ మీడియా వేదికగా మన్సూర్ అలీ ఖాన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహిళలను కించపరిచే విధంగా మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడాడని ఇప్పటివరకు అతనితో నటించకపోవడం తన అదృష్టం, ఇకమీదట తాను అతనితో నటించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ తర్వాత అనేకమంది త్రిషకు మద్దతుగా మాట్లాడారు.
PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్లో ప్రధాని మోడీ..
Also Read
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
- Ajith Kumar : అజిత్ కుమార్ - విక్టరీ వెంకటేష్ - మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
- King 100: నాగ్100పై సస్పెన్స్కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
సోషల్ మీడియాలో మనుషుల అలీ ఖాన్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఖుష్బూ, చిరంజీవి అయితే మరింత ఘాటుగా మాట్లాడారు. అయితే ఈ విషయంలో తానేమీ తప్పు మాట్లాడలేదని మన్సూర్ అలీ ఖాన్ ముందు నుంచి చెబుతూనే వచ్చారు. అయితే తమిళ నడిగర్ సంఘం మొదలు అనేకమంది మన్సూర్ అలీ ఖాన్ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న నేపథ్యంలో తన తప్పు లేదని అంటూనే త్రిష బాధ పడింది కాబట్టి క్షమించాలని క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా ఈ కేసులో త్రిష, నటి కుష్బూ, మెగాస్టార్ చిరంజీవి మీద పరువు నష్టం పరిహారం, క్రిమినల్, సివిల్ దావా సహా ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడారని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ ప్రకటించారు. తన లాయర్ ద్వారా రేపు కోర్టులో వీరి మీద కేసు నమోదు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లబోతుంది అనేది కాలమే నిర్ణయించాలి.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!