Manchu Lakshmi: ఏది.. ఈ విషయంలో మంచు లక్ష్మీని ట్రోల్ చేయండి.. చూద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు గురించి కానీ, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి గానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబాన్ని మొత్తం సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తువుగా వాడుకుంటారు. వాళ్ళు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా ట్రోల్స్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ ఇంగ్లీష్ గురించి, డ్రెస్సింగ్ స్టైల్ గురించి ట్రోల్ చేయడం తెల్సిందే. అయితే ఇవేమీ పట్టించుకోని మంచు కుటుంబం తమ పనుల్లో తమ బిజీగా ఉంది. ఇక మంచు లక్ష్మీ గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఆమె నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. ఇంకొపక్క తల్లిగా కూతురుతో నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మంచు లక్ష్మీ చేసిన ఒక పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా అభిమానుల ప్రశంసలను అందుకుంటుంది. అదేంటంటే.. మంచు లక్ష్మీ గతేడాది నుంచి టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను ఆమె దత్తత తీసుకుంది.
Nikhil: ప్లాప్ ఎఫెక్ట్.. ఆ కండీషన్లు పెట్టిన నిఖిల్.. ?
Also Read
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
సరైన చదువు లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కానీ, లేక చదువుకోవాలని ఉన్న చదవలేని విద్యార్థులను, మంచి సదుపాయాలు లేని స్కూల్స్ ను దత్తత తీసుకొని దగ్గరుండి ఆ స్కూల్స్ ను బాగుచేయించడం, విద్యార్థుల అవసరాలను తీర్చడం లాంటివి టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో చేస్తారు. ఇందులో సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలలను మంచు లక్ష్మీ దత్తత తీసుకుంది. ఇక దత్తత తీసుకున్న పాఠశాలలకు వెళ్లి ఆమె వారికి ఏఏ అవసరాలు ఉన్నాయో అని తెలుసుకుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అక్క చేసిన పనికి తమ్ముడు మంచు మనోజ్ గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. మంచు లక్ష్మీ ఫోటోలు షేర్ చేస్తూ.. “మా అక్కని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో ని 30 పాఠశాలలను దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయంలో మా అక్కకు సహకరించిన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన మంచక్క అభిమానులు ఏది ఇప్పుడు.. ట్రోల్ చేయండి మా మంచు లక్ష్మీని.. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించరు గాని ట్రోల్ చేయడానికి అయితే ముందుంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది చాలా మంచి పని చేశారు.. ఇలాగే మంచి పనులు చేయండి.. అంటూ మంచు లక్ష్మీని ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..