పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “భీమ్లా నాయక్”ను చూసి రివ్యూ షేర్ చేశారు.
Read Also : చిత్ర విచిత్రం… సుబ్బరాజు చిత్రప్రయాణం!
“#భీమ్లా నాయక్ రివర్టింగ్, ఇంటెన్స్, ఎలక్ట్రిఫైయింగ్! పవన్ కళ్యాణ్ బ్లేజింగ్ ఫామ్లో ఉన్నాడు… వాట్ ఏ పెర్ఫార్మెన్స్!! ‘డేనియల్ శేఖర్’ గా రానా సంచలనం.. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్” అంటూ ఇద్దరు హీరోలనూ మహేష్ బాబు ఆకాశానికెత్తేశారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ ను మాత్రం ప్రత్యేకంగా అభినందించారు. “త్రివిక్రమ్ రచన ఎప్పటిలాగే షార్ప్, బ్రిలియంట్… ఇటీవలి కాలంలో ఉత్తమమైనది” అంటూ మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో “ఎస్ఎస్ఎంబి28” రూపొందనున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ ఇద్దరు హీరోలను, త్రివిక్రమ్ ను మాత్రమే కాకుండా దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు చిత్రబృందం మొత్తాన్ని అభినందించారు.
#BheemlaNayak is riveting, intense and electrifying! @PawanKalyan is in blazing form 🔥🔥🔥 what a performance!! @RanaDaggubati is sensational as 'Daniel Sekhar'.. what a screen presence!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022