Rajamouli: ‘జక్కన్న’తో అమిత్ షా మీటింగ్ ఎందుకబ్బా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah to Meet Rajamouli at His Residence: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను కలుస్తున్నారు, తమ ప్రభుత్వ ఘనతలు చెప్పి తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఆయన రాజమౌళితో భేటీ కానుండడం హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి 11.55నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమానంలో చేరుకునే అమిత్ షా నోవాటెల్ హోటల్లో బస చేస్తారు.
Also Read: Adipurush Tickets: పీపుల్స్ మీడియా నిర్మాతలకు మెంటలెక్కిస్తున్నారట!
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
గురువారం ఉదయం 7.30గంటలకు నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యి భేటీ అనంతరం హైదరాబాద్ లో పలువురు ప్రముఖులను అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం అంటే రాజమౌళి నివాసానికి వెళ్లి అక్కడ దాదాపు అరగంట పాటు సమయం వెచ్చించనున్నారు. ఇదే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది, ఎందుకంటే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్కు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా బీజేపీ అవకాశం కల్పించింది. ఆ తరువాత దానికి కృతజ్ఞతగా బీజేపీకి తెలంగాణాలో కలిసి వచ్చేలా రజాకార్ ఫైల్స్ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. ఇక ఈ తరుణంలో రాజమౌళితో అమిత్ షా భేటీ కానుండటం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ను అమిత్ షా ఒకసారి కలిసి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
Also Read: #VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ
అలాగే అంతకంటే ముందు కూడా ఒకసారి బేగంపేట్లోని ఒక హోటల్లో జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కావడం అప్పట్లో కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు కారణమైంది. ఇలా హైదరాబాద్ పర్యటనలకు వచ్చిన సమయంలో సినీ ప్రముఖులను అమిత్ షా కలవడం వెనుక పొలిటికల్ మైలేజే లక్ష్యం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ సినీ గ్లామర్ తెచ్చేందుకే ఇలా సెలబ్రెటీలతో భేటీ అవుతున్నారు అని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిననప్పుడు హీరో నితిన్ ను కూడా అందుకే కలిశారని అంటున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా అమిత్ షా కలుస్తున్నారని దీనికి రాజకీయ ప్రాముఖ్యత లేదని అంటున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!