“ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మహా సముద్రం”. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “మహా సముద్రం” కమర్షియల్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతుండగా టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. “మహా సముద్రం” ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు టైం, డేట్, ప్లేస్ ను ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 9 న జెఆర్సి కన్వెన్షన్లో లో ‘మహా సముద్రం’ సాయంత్రం 6 గంటలకు జరగనుంది.
Read Also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్
శర్వానంద్, సిద్ధార్థ్ మధ్య నీటి అడుగున చేసే ఫైట్ సినిమాలోని హైలెట్ లలో ఒకటి. ఈ చిత్రంలో జగపతి బాబు, రావు రమేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 14 న “మహా సముద్రం” థియేటర్లలో విడుదల కానుంది.