సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’. అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్.ఎక్స్. 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. ముందు అనుకున్న విధంగానే దసరా కానుకగా ‘మహా సముద్రం’ మూవీ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.