Rajini Kanth: మనసిలాయో అంటున్న రజనీకాంత్
- వేట్టైయాన్ - ది హంటర్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్
- మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం
- బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ – ది హంటర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు పుట్ స్టాపింగ్ ట్యూన్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ నాలుగోసారి రజినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఎనర్జిటిక్ బీట్తో సాగుతుంది.
Also Read: Rashmika Mandanna: రష్మిక’కి ప్రమాదం.. ఏమైందంటే?
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
రజినీకాంత్, మంజు వారియర్ మధ్య వచ్చే పాట అని తెలుస్తుంది. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం. సూపర్ స్టార్ ఇమేజ్కు తగ్గట్టు ఆయన అభిమానులు సహా అందరినీ దృష్టిలో పెట్టుకుని అనిరుధ్ మరోసారి తనదైన పంథాలో బాణీలను అందించినట్లు ‘మనసిలాయో..’ అనే పాటను వింటుంటే తెలుస్తోదిసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను నకష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ పాడారు. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ఈ పాట తమిళ వెర్షన్ కోసం లెజెండ్రీ ప్లే బ్యాక్ సింగ్ మలేషియా వాసుదేవన్ వాయిస్ను ఏఐలోక్రియేట్ చేసి ఇందులో ఉపయోగించటం విశేషం. రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆడియెన్స్కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!