భారత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవాల్లో భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కోరారు. సాంస్కృతిక మహోత్సవాలపై తాజాగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో “భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశం మన భారతదేశం. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా భారత కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండడం మనందరికీ గర్వకారణం.
Read Also : Bheemla Nayak : అనుకున్న దానికంటే ముందే ఓటిటిలో !
మనదేశ ఘన వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచే వివిధ సాంస్కృతిక కళారూపాలను ఎందరో కళాకారులు రాజమహేంద్రవరం ఈ నెల 26, 27 తేదీల్లో, వరంగల్ లో ఈ నెల 29, 30 తేదీల్లో, ఇక మన హైదరాబాద్లో ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో ప్రదర్శిస్తారు. మన మహోజ్వల చారిత్రక సాంస్కృతిక కళా మహోత్సవాలను తిలకిద్దాం. దాన్ని విజయవంతం చేద్దాం. మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో మనందరం భాగస్వాములం అవుదామని రండి.. జైహింద్” అంటూ అంటూ మెగాస్టర్ పిలుపునిచ్చారు.
Come, Let's celebrate our Artists & Artisans.Let's celebrate our Unity in Diversity! Let's celebrate our vibrant #RashtriyaSanskritiMahotsav !@kishanreddybjp pic.twitter.com/wdd3c8AwfV
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 22, 2022