సూర్యకు షాకిచ్చిన హైకోర్టు… పన్నులు చెల్లించాల్సిందే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 3 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం తోసిపుచ్చింది. ఇటీవలే అగ్ర నటులు విజయ్, ధనుష్ తమ లగ్జరీ కార్ల కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ చేసిన విన్నపాలకు ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు. ఈ మూడు కేసుల్లోనూ జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 2007-2008, 2008-2009 ఆర్థిక సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుని 2010 సంవత్సరంలో సూర్య ఆస్తులపై దాడులు నిర్వహించి, పైన పేర్కొన్న ఆర్థిక సంవత్సరాలకు 3 కోట్ల 11 లక్షల 96 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు.
ఐటీ శాఖ ఈ కేసును మూడేళ్లు ఆలస్యం చేసిందని పేర్కొంటూ మినహాయింపు కోరుతూ సూర్య 2018లో కోర్టును ఆశ్రయించారు. అతను ఎలాంటి డిఫాల్ట్లు లేని సాధారణ పన్ను చెల్లింపుదారుడని, ఆయనకు మినహాయింపు కోరే హక్కు ఉందని సూర్య వైపు లాయర్ వాదించారు. అయితే పన్ను చెల్లింపుల విషయంలో సూర్య సహకరించలేదని ఐటి శాఖ కౌన్సిల్ వాదించింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఐటీ శాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
Also Read
అక్టోబర్ 2010 లో, నటుడు సూర్య ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసింది. తరువాత 2007-2008 & 2008-2009 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 3 కోట్ల 11 లక్షల 96 వేల రూపాయలను ఆదాయపు పన్నుగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూర్యను ఆదేశించింది. ఆదాయపు పన్ను శాఖ సూర్యకు పన్నుతో పాటు ఈ సంవత్సరాలకు వడ్డీ చెల్లించాలని సూచించింది.
Read Also : చై, సామ్ కల తీరబోతోంది !
దీనిపై సూర్య ఆదాయపు పన్ను ట్రిబ్యునల్లో అప్పీల్ దాఖలు చేశారు. అయితే, ఆదాయపు పన్ను ట్రిబ్యునల్ కూడా ఆదాయపు పన్నును వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీని తరువాత, సూర్య ట్రిబ్యునల్ తీర్పుపై 2018 లో చెన్నై హైకోర్టులో కేసు వేశారు. ఈ రోజు (17.08.2021) కేసు విచారణకు వచ్చినప్పుడు, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, నటుడు సూర్య పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
సోషల్ మీడియాలో ఈ సమస్య సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ సిఇఒ రాజేశ్వర్ పని దాన్ స్పందించారు. “పన్నులు, వడ్డీని సరిగ్గా చెల్లించి ఆదాయపు పన్ను శాఖకు పూర్తి సహకారం అందించాము. ఈ రోజు మా వైపు నుండి చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు! ఆదాయపు పన్నుపై వడ్డీని తిరిగి చెల్లించడానికి మాత్రమే కేసు ఉంది” అంటూ ఈ తీర్పుపై అప్పీల్ చేయబోతున్నట్లు ఆయన వివరించారు.
ఇక సినిమాల విషయానికొస్తే తొమ్మిది భాగాల నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ ‘నవరస’లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన’ గిటార్ కంబి మేలే నిండ్రు’ చిత్రంలో సూర్య చివరిసారిగా కనిపించాడు. నవంబర్లో ఆయన నటించిన ‘జై భీమ్’ విడుదల కానుంది. ఆయన చేతిలో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘వాడివాసల్’, పాండిరాజ్ దర్శకత్వం వహించిన ‘ఈతర్క్కుం తునింధవన్’ చిత్రాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?