సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటే పూర్తిగా పైసల్తో పని. నిర్మాత బాగుంటేనే కళామతల్లి కలకాలం కళకళలాడుతోంది. అందుకే ఓ సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు, కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొడితే చాలు బడా నిర్మాణ సంస్థలైనా బిషాణా ఎత్తేయడానికి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనేక సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటి టఫ్ ఫీల్డ్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు నారీమణులు. ఎప్పుడో భానుమతి, సావిత్రి, విజయ నిర్మల కాలం నుండే మహిళా నిర్మాతలుగా రాణిస్తున్నా ఇప్పుడు ఆ పరంపర ఊపందుకుంది. ప్రొడక్షన్స్లోకి అడుగుపెట్టి ఉమన్ ఎంపర్మెంట్ చూపిస్తున్నారు యంగ్ క్వీన్స్.
Also Read : AA 22 : అల్లు అర్జున్..అట్లీ.. పాన్ వరల్డ్ సినిమా.!
కల్కి 2898ఏడీతో సెన్సేషనల్ నిర్మాతలుగా మారారు ప్రియాంక దత్, స్వప్నాదత్. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని తమకంటూ ఓ ఐడెంటిటీ కావాలని స్వప్న సినిమాస్, త్రీ ఏంజిల్స్ స్టూడియోపై మంచి హిట్స్ చిత్రాలను తెరకెక్కించారు. మంచి ఈజ్ ఉన్న లేడీ ప్రొడ్యూసర్లుగా మారారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి కూడా ఇద్దరు నారీమణులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఫింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్లు నిర్మించడంతో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఫస్ట్ హిట్ చూసింది నిహారిక కొణిదెల. ఇటీవల సెకండ్ సినిమాను శోభన్ తో నిర్మిస్తోంది. అలాగే మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్గా కొనసాగిన చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్మైన్ మెంట్ ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసి పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. చిరు, అనిల్ రావిపూడి సినిమాలో భాగస్వామ్యంగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు తనయ హన్షితా రెడ్డి కూడా ఇదే రంగంలో కంటిన్యూ అవుతోంది. బలగం మూవీకి ప్రొడ్యూసర్గా మారి బ్లాక్ బస్టర్ హిట్ చూసింది. లవ్ మీ, జనక అయితే గనక లాంటి సినిమాలకు రూపొందించింది.