రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రాంకీ, రఘు కుంచె, దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా గురించి నిర్మాత అహితేజ మాట్లాడుతూ, ”మా చిత్ర హీరోయిన్ కోమలీ ప్రసాద్ బర్త్ డే సందర్బంగా యూనిట్ తరపున బర్త్ డే విషెస్ తెలుపు తున్నాం. ఆమె స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశాం. ఇక సినిమా గురించి చెప్పాలంటే, ‘పలాస 1978’ తో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి చాలా చక్కని నటనను కనబరిచాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చాలా చక్కగా గ్రాండియర్గా, హై స్టాండర్డ్స్లో తెరకెక్కిస్తున్నాడు.
హీరో, హీరోయిన్స్ పై సాగే లవ్ సీన్స్ చాలా కొత్తగా యూనిక్గా ఉంటాయి. ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇండస్ట్రీ లో ప్రస్తుతం షూటింగ్ నిలిపి వేత కారణంగా మా మూవీ షూటింగ్ కూడా నిలుపుదల చేశాం. సెప్టెంబర్ 1 నుండి షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న 10 రోజుల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం” అని అన్నారు.