బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించింది.. బాలివుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రానిస్తుంది.. ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.. రాజస్థాన్లో ఖరీదైన ఫాలెస్ లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు..
ఇది ఇలా ఉండగా.. కియారా సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది..కారు విలువ దాదాపు భారత మార్కెట్లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని టాక్..మొన్నీమధ్య ఈ అమ్మడు తన భర్తతో కలిసి జపాన్ టూర్కు వెళ్లిన భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఆ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది..
ఇక పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు బిజీగానే ఉంది.. అటు బాలివుడ్ తో పాటు ఇటు తెలుగులో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.. ప్రస్తుతం. ఈ అమ్మడు తెలుగు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది..గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేసిన సినిమాలో కూడా నటించింది..