Karan Johar : నిర్మాతగా కరణ్ జోహార్కు వరుస దెబ్బలు.. దర్శకుడిగా ఆ సినిమాకు సీక్వెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాతగా ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నా దర్శకుడిగా సెంట్ పర్సెంట్ సక్సెస్ ఫుల్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేయాలన్నా హార్ట్ టచ్చింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రొమాంటిక్ కామెడీలు తీయాలన్నా ఆయనకు ఆయనే సాటి. కుచ్ కుచ్ హోతా హై నుండి దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం కభీ ఖుషీ కభీగమ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ వరకు సాగింది. కానీ 2023 నుండి మెగా ఫోన్కు దూరంగా ఉన్న కరణ్ నిర్మాతగా స్టార్ కిడ్స్ను స్టార్స్గా మార్చే పనిలో బిజీగా మారిపోయాడు. వాళ్లతోనే ఎక్కువగా సినిమాలు నిర్మిస్తూ చేతులు కాల్చుకున్నాడు.
Also Read : MSG : మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. ఇంతకీ ఎక్కడంటే?
Also Read
- Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
- Huma Qureshi: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్
2024లో వచ్చిన కిల్ తర్వాత నిర్మాతగా సరైన బ్లాక్ బస్టర్ చూడలేదు కరణ్ జోహార్. అదే ఏడాది తన ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్లో 50 శాతం వాటాను అమ్మేశాడు. 2025లోనైనా కోలుకుంటాడేమో అనుకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాది వచ్చిన కేసరి చాప్టర్ 2 నుండి ఇయర్ ఎండింగ్లో వచ్చిన లవ్ స్టోరీ తు మేరీ మే తేరా మే తేరా తూ మేరీ వరకు వరుస ఫ్లాప్స్ అతడ్ని, నిర్మాణ సంస్థను మరింత కుంగదీశాయి. దాంతో ఇక తానే రంగంలోకి దిగి త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ను టచ్ చేయబోతున్నాడు. కరణ్ జోహార్ క్లాసిక్ మూవీల్లో ఒకటైన కభీ ఖుషీ కభీ గమ్ సీక్వెల్ ప్లాన్ చేయబోతున్నాడు. 2001లో అమితాబ్, షారూక్, హృతిక్ లాంటి మల్టీస్టారర్స్తో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 130 కోట్లను వసూలు చేసింది. ఓవరీస్లోనూ విపరీతంగా ఆడేసిన 25 ఏళ్ల కల్ట్ క్లాసిక్కు పార్ట్2 తీయాలనుకుంటున్నాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఇయర్ ఎండింగ్లోగా మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు బీటౌన్ ట్రేడ్స్ అంటున్నాయి.
తాజావార్తలు
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
-
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
-
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!