Karan Johar : ఆ సంఘటన తర్వాత నేను క్రికెటర్లను పిలవడం ఆపేశా – కరణ్ జోహార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న హిట్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో, స్టార్ గెస్ట్లతో హైలైట్ అవుతూ ఉంటుంది. సినీ, క్రికెట్, టెలివిజన్ ప్రపంచానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు భారత క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ షో లో కనిపించలేదు. దీనికి గల కారణాన్ని కరణ్ తాజాగా బయటపెట్టారు. ఇటీవల భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా నిర్వహిస్తున్న పోడ్కాస్ట్ ‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ లో కరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా, “మీ షోకి రావడానికి నిరాకరించే సెలబ్రిటీ ఎవరు?” అని అడగగా, కరణ్ “రణబీర్ కపూర్” అని సమాధానమిచ్చారు. “అతను గతంలో షో కి వచ్చాడు కానీ గత మూడు సీజన్ల నుంచి రానని చెప్పాడు” అని కరణ్ తెలిపారు.
Also Read : Peddi : ‘పెద్ది’తో నా కల నెరవేరింది.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్
Also Read
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
అయితే విరాట్ కోహ్లీ గురించి ప్రశ్న రాగానే, కరణ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “నేను విరాట్ కోహ్లీని ఎప్పుడూ షోకి ఆహ్వానించలేదు. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఘటన తర్వాత నేను ఏ క్రికెటర్లను పిలవడం ఆపేశాను. ఆ సంఘటన తర్వాత చాలా మంది రారని అనుకున్నాను. అందుకే ఇకపై క్రికెటర్లను ఆహ్వానించలేదు” అని కరణ్ చెప్పారు. అసలు ఏం జరిగింది అంటే.. 2019లో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆ ఎపిసోడ్లో వీరిద్దరూ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారని చాలా మంది ఖండించారు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆ ఎపిసోడ్ను డిస్నీ+ హాట్స్టార్ నుంచి తొలగించారు. అంతేకాక, బీసీసీఐ వారిద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తరువాత ఇద్దరూ ప్రజా పరంగా క్షమాపణలు చెప్పారు. ఆ సంఘటనకు తాను కూడా ఒక విధంగా బాధ్యత వహించాల్సి వచ్చిందని కరణ్ జోహార్ అంగీకరించారు. “ఆ ఘటన నాకు పెద్ద పాఠం నేర్పింది. అందుకే ఇకపై క్రికెటర్లను షోకి ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నాను” అని కరణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!