JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Chakravarthy: జేడీ చక్రవర్తి అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. సుమారు మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఇటీవల ఆయన తన వ్యక్తిగత జీవితం, జీవనశైలి గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తనకంటూ కొన్ని కఠినమైన నియమాలను ఏర్పరచుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు జేడీ.
‘బయటి ప్రపంచంతో కట్’..
జేడీ చక్రవర్తి తన దైనందిన జీవితం గురించి వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ తెల్లవారుజామున 4:30 నుంచి 5:15 గంటల మధ్యే నిద్రలేస్తాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ పనులు, షూటింగ్లతో బిజీగా గడిపినప్పటికీ, సాయంత్రం 7:30 గంటలకు ఒక ‘డెడ్ లైన్’ పెట్టుకున్నాను. ఆ సమయం దాటితే తన ఫోన్ను పక్కన పెట్టేస్తానని, బయటి ప్రపంచానికి, సినిమా ఈవెంట్స్కు లేదా పార్టీలకు అస్సలు అందుబాటులో ఉండనన్నారు. ఆ సమయాన్ని కేవలం తన కోసం, తన తల్లి కోసం మాత్రమే కేటాయిస్తానని చెప్పారు. గత 33 ఏళ్లుగా ఈ అలవాటును ఒక్క రోజు కూడా మార్చుకోలేదని చెప్పారు.
Also Read
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
- Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్గా 'శ్రీనివాస మంగాపురం' టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
- Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్గా సుమంత్.. 'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
అమ్మే నా సర్వస్వం.. తోడు అవసరం లేదు
పెళ్లి, ఒంటరితనం గురించి జేడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. “నాకు ఒక తోడు కావాలని లేదా ఎవరితోనైనా విషయాలు పంచుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు” అని ఆయన అన్నారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించగలిగే వారితోనే పంచుకోవాలని, అనవసరంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నేను నమ్ముతారనన్నారు. తన తల్లిని ఒక స్నేహితురాలిగా, ఒక గొప్ప తోడుగా భావిస్తానని, ఆమెతో ఉన్న అనుబంధం తనకు పూర్తి సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని కాకుండా, మనకు ఏది ప్రశాంతతను ఇస్తుంది అనేదే ముఖ్యమని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
-
Israel: వెస్ట్ బ్యాంక్లో భారీ ఆపరేషన్కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
-
Kishan Reddy : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..
-
Harish Rao : డాక్టర్ మమతకు హరీష్ రావు సెల్యూట్.. ‘దేవుళ్లు ఎందుకంటారో నిరూపించారు.!’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!