Jayam Ravi : ‘దేవుడిని మోసం చేయలేవు’.. జయం రవి టూర్పై ఆర్తి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఈలోగా జయం రవి తన స్నేహితురాలు, గాయని కెనీషా తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమల తిరుపతి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ టూర్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జయం రవి మాజీ భార్య ఆర్తి షేర్ చేసిన పోస్ట్ మరింత హాట్ టాపిక్గా మారింది.
Also Read : Mirai : మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. “నువ్వు ఇతరులను మోసం చేయవచ్చు.. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు.. కానీ దేవుని మాత్రం మోసం చేయలేవు”అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఈ మాటలను జయం రవి ని ఉద్దేశించి రాసి ఉంటారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఇదే కాదు, ఇటీవల ఆమె తన పిల్లల కోసం మరో నోట్ షేర్ చేశారు. అందులో, “ఉత్తమ తల్లిదండ్రులంటే ఎల్లప్పుడూ పిల్లల కోసం ఆలోచించేవారే. ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఏ పరిస్థితులు వచ్చినా వారిని కాపాడండి” అని పేర్కొన్నారు. అంటే దీని బట్టి..
వీరిద్దరూ విడాకులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతే కాదు తన భర్త జయం రవి నుంచి నెలకు రూ. 40 లక్షల భరణం ఇవ్వాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రజంట్ అయితే తాజా పోస్ట్లు.. టూర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..