జాన్వి కపూర్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ‘పెద్ది’ సినిమా ఆమెకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ని ఎక్కువగా తెచ్చిపెట్టింది. ఇప్పుడంటే సమస్య సద్దుమనిగింది కానీ, రిలీజ్ అయిన కొత్తలో జాను అవుట్ఫిట్, మూవీలోని ఆమె క్యారెక్టర్ పై విమర్శలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాకి దూరమైంది జాన్వి. సినిమా గురించి కానీ, విమర్శలపై కానీ ఎటువంటి కామెంట్లు చేయలేదు. ఇక సినిమా వచ్చి రోజులు కావడం, ఆడియన్స్ మర్చిపోవడంతో మళ్ళీ యాక్టివ్ అయి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది భామ.
జాన్వి సోషల్ మీడియా రీఎంట్రీ ఇస్తే, కయాదు లోహర్ స్మాల్ బ్రేక్ తీసుకుంటున్నట్లుగా స్టేట్మెంట్ పాస్ చేసింది. “కొన్నిసార్లు మనం శరీరానికి ఇచ్చే రెస్ట్ మనసుకు కూడా అవసరం. నేను కాస్త నెమ్మదించి డిస్కనెక్ట్ అవ్వాలని, స్క్రీన్ కు అవతలి వైపు ఉన్న జీవితంతో.. నాతో నేను ఎక్కువ టైం గడపాలని భావిస్తున్నాను” అంటూ నోట్ పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచిన వారికి థాంక్స్ చెబుతూ.. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే తన టీం ఇన్స్టా అకౌంట్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తుందంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో విమర్శల వల్ల నెట్టింటికి దూరమవుతున్నారు భామలు.

