రామచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా, ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల కొండపై జాన్వి చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో జాన్వి సాంప్రదాయ దుస్తుల్లో, ఒక అరుగుపై సాధారణ భక్తురాలుగా కూర్చొని కనిపించారు.
తన జీవితంలో ఏ చిన్న ముఖ్యమైన ఘట్టం ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వి కపూర్కు తల్లి శ్రీదేవి నుంచి వచ్చిన అలవాటు. ఈసారి ‘పెద్ది’ విజయం కోసం ఆమె కాలినడకన స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ‘పెద్ది’ సినిమాలో జాన్వి పాత్ర గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
ఎన్నో ఆశలు పెట్టుకొని ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వికి, అందులో సరైన పాత్ర దక్కలేదు. ‘తంగం’ అనే పాత్రలో జస్ట్ గ్లామర్తోనే, తక్కువ స్క్రీన్ స్పేస్తో సరిపెట్టుకుంది అమ్మడు. పోనీ ఇప్పుడు ‘పెద్ది’లో ఏమైనా అదిరిపోయే క్యారెక్టర్ పడిందా అంటే.. అసలు సినిమాలో ఆమె ట్రాక్ అనవసరం అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె సీన్స్ కొన్ని క్రింజ్గా కూడా అనిపించాయి. గ్లామర్ కోసం తప్ప, జాన్వి లవ్ ట్రాక్ సినిమాకు కాస్త మైనస్ అనేది పబ్లిక్ టాక్. మొత్తంగా ‘పెద్ది’లో జాన్వి కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే కామెంట్స్ వస్తున్నాయి.
