Actress Fees : ఈ స్టార్ హీరోయిన్లు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించే కాదు వాళ్ళు తీసుకునే భారీ పారితోషికం కూడా హాట్ టాపిక్కే ! అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. నేషనల్ వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్లు కొంతమంది కోట్లలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే పరిధులు దాటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్.
Read Also : Valimai : అజిత్ సినిమాకు లెంగ్తీ రన్ టైమ్
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
దీపికా పదుకొణె పఠాన్, గెహ్రైయాన్ రెండింటిలోనూ భాగం కావడానికి రూ. 15 కోట్లు, డార్లింగ్స్ కోసం అలియా భట్ రూ. 15 కోట్లు వసూలు చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి’తో పాటు కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో కూడా భాగం కావడానికి అలియా తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ‘జీ లే జరా’ కోసం కత్రినా కైఫ్ దాదాపు రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ ఉన్నారు. వారిద్దరూ బాలీవుడ్లో తమ పనిని తగ్గించుకున్నారు. ప్రియాంక చోప్రా ‘జీ లే జరా’ కోసం 10 కోట్ల రేంజ్లో అందుకుంది. అయితే ‘స్కై ఈజ్ పింక్’కి 8 కోట్ల రూపాయలకు సంతకం చేసింది. ఇక కంగనా ఒక్కో సినిమాకు 21 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని వినికిడి. కానీ ఆమె పారితోషికం 8 నుంచి 9 కోట్ల రేంజ్లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
శ్రద్ధా కపూర్ రూ.7 కోట్లు వసూలు చేస్తోంది. తాప్సీ పన్ను ‘లూప్ లాపేట’ కోసం రూ. 5 కోట్లు అందుకుంది. అయితే విద్యాబాలన్ గత కొన్నేళ్లుగా తన సినిమాలన్నింటికీ రూ.4 కోట్లు వసూలు చేస్తుంటే… కృతి సనన్ కూడా అదే బాటలో నడుస్తోంది. కియారా అద్వానీ రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ‘జగ్ జగ్ జీయో’ను రూ. 2.50 కోట్లకు ఓకే చేయగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ ప్రతి చిత్రానికి రూ. 2.00 నుంచి 2.50 కోట్లు అందుకుంటున్నారు. అయితే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ కూడా రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుండగా, మరోవైపు అనన్య పాండే రూ.1.50 కోట్లు వసూలు చేస్తోంది. ఏదేమైనా హీరోల రెమ్యూనరేషన్ తో పోలిస్తే హీరోయిన్లకు తక్కువగానే అందుతుందని చెప్పాలి.
తాజావార్తలు
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!