NTV Telugu Site icon

Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…

Adah Sharma

Adah Sharma

ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ ‘ది కేరళ స్టొరీ’ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివాదాస్పద సినిమాగా పేరు తెచ్చుకున్నా, రాష్ట్రాలు బాన్ చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ది కేరళ స్టొరీ అసలు తగ్గట్లేదు. వారం తిరిగే లోపు 113 కోట్లు రాబట్టిన ఈ మూవీ, సెకండ్ వీక్ ఎండ్ అయ్యే సరికి 200 కోట్ల మార్క్ చేరుకోవడానికి రెడీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇండియా వైడ్ ది కేరళ స్టొరీ అయినంత హాట్ టాపిక్ మరో సినిమా కాలేదు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో ఇండియాకి వ్యతిరేఖంగా కార్యకలాపాలు చేస్తున్నారు అని ది కేరళ స్టొరీ సినిమాలో చెప్పడంతో సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. కేరళలో ఇప్పటివరకూ 32000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్లంతా ఏమయ్యారు అనే ప్రశ్న లేవనెత్తడంతో ది కేరళ స్టొరీ మరింత వివాదాస్పదం అయ్యింది.

ఇదిలా ఉంటే అదా శర్మతో పాటు ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేసిన సుధీప్తో సేన్ కి యాక్సిడెంట్ అయ్యింది. ముంబైలో ఓ ఈవెంట్ కి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్‌ జరిగింది. “కరీంనగర్‌లో ఈరోజు సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా” ఈ యాక్సిడెంట్ జరగడంతో… ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్ “తాము కరీంనగర్ రాలేకపోతున్నట్లు” ట్వీట్ చేశాడు. “Today we’re supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra ” అంటూ సుదీప్తో సేన్ పోస్ట్ చేశాడు.