Daggubati Family : నాంపల్లి కోర్ట్ కు హీరో దగ్గుబాటి వెంకీ ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్కన్ కిచెన్ హోటల్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు దగ్గుబాటి ఫ్యామిలీ తో పాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13 వ తారీఖున అక్రమంగా కూల్చివేయడం తో పాటు అక్కడ వున్న సామగ్రి ని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీ పై కేసు నమోదు చేయడం జరిగింది.
Also Read : Kollywood : అన్నాదమ్ముల సినిమాలు వచ్చేదెప్పుడు..?
Also Read
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
కానీ దగ్గుబాటి బ్రదర్స్ కోర్టు కేసు ని లెక్కచేయకుండా మరోసారి 2024 మార్చి లో నందుకుమార్ హోటల్ బిల్డింగ్ ని భారీ సంఖ్య లో వ్యక్తిగత బౌన్సర్ లను వినియోగించి పూర్తిగా నేలమట్టం చేశారు.హోటల్ లో వున్న కోట్ల విలువ చేసే సామగ్రి ని దొంగతనం చేశారు. దీనిపై నందకుమార్ మరోసారి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుబాటి ఫ్యామిలీ పై పిర్యాదు చేశాడు. కానీ ఈ ఫిర్యాదుపై పోలీస్ లు స్పందించలేదు. దాంతో నందకుమార్ మరో మారు నాంపల్లి కోర్టు ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ జనవరి 2025 లో కేసు నమోదు చేయవలసినది గా పోలీస్ లని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీస్ లు మరోసారి కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి FIR NO:25/2025 గా నమోదు చేశారు, కానీ గత పది నెలలుగా ఈ కేసు పై ఎలాంటి విచారణ జరపకుండా ఫిల్మ్ నగర్ పోలీస్ లు కాలయాపన చేస్తున్నారు.
పోలీస్,న్యాయ వ్యవస్థలని డబ్బు మరియు పలుకుబడితో నిర్వీర్యం చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ ఈ రోజు అనగా జనవరి 9 న కోర్టు కి హాజరు కావలసి వుంది. గతంలో పలు మార్లు నోటీసులు అందిన విచారణకు గైర్హాజరైన దగ్గుపాటి ఫ్యామిలీ. ఈ సారి అయినా దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను గౌరవించి కోర్టు కు హాజరు అవుతారా లేదా అని వేచి చూడాలి. గతంలో వ్యక్తిగత బాండ్లను దగ్గుపాటి ఫ్యామిలీ తరపున లాయర్లు సమర్పించగా తిరస్కరించి కోర్టు ధిక్కరణ కింద వ్యక్తి గతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు. దగ్గుపాటి ఫ్యామిలీ మెంబెర్స్ స్వయంగా నేడు బాండ్లను ఇవ్వకుంటే నాన్ బైలబుల్ వారెంట్ (N.B.W) విందించే అవకాశం ఉంది.. ఈ కేసులో తనకు జరిగిన నష్టం పై న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పాడు దక్కన్ హోటల్ యజమాని నంద కుమార్.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!