Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి నెగటివ్ రివ్యూస్.. పోలీసులకి టీం ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram team files a Cybercrime complaint against alleged fake ratings on Book My Show: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ముఖ్యంగా రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోటీ నెలకొంది. ఆ రెండు సినిమాలు మరేమిటో కాదు తేజ హీరోగా నటించిన హనుమాన్, మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం. నిజానికి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాని తొలత జనవరి 13వ తేదీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు కానీ ఎందుకో దాన్ని జనవరి 12కి షిఫ్ట్ చేశారు. అయితే హనుమాన్ సినిమా టీం పది సార్లు వాయిదా వేసుకుంటూ జనవరి 12వ తేదీ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు గుంటూరు కారం టీం కంటే ముందు హనుమాన్ టీం ప్రకటించింది. అయితే ఇద్దరూ వెనక్కి తగ్గడానికి నిరాకరించడంతో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 11వ తేదీన హనుమాన్ సినిమాకి పైడ్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి బుక్ మై షోలో నెగిటివ్ పెయిడ్ క్యాంపెయిన్ జరుగుతోందని సినిమా యూనిట్ భావిస్తోంది.
Chiranjeevi: సంక్రాంతికి సినిమా లేదు కానీ.. మూడు సినిమాల్లో మెగాస్టార్
Also Read
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
ఎందుకంటే సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయితే నాలుగు సినిమాల్లో గుంటూరు కారం సినిమాకి మాత్రమే చాలా తక్కువ రేటింగ్ చూపిస్తోంది. ప్రస్తుతానికి గుంటూరు కారం సినిమాకి బుక్ మై షో లో 6.6 రేటింగ్ మాత్రమే ఉంది. ఇక మరో పక్క హనుమాన్ కి 9.6 ఉండగా సైంధవ్ సినిమాకి 8.5, నా సామిరంగా సినిమాకి 8.1 రేటింగ్స్ ఉన్నాయి. కావాలనే తమ సినిమా మీద పెయిడ్ నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని భావిస్తున్న గుంటూరు కారం సినిమా యూనిట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, రఘుబాబు, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయి మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని ముందు నుంచి సినిమా యూనిట్ భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ టీం కి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!