Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి నెగటివ్ రివ్యూస్.. పోలీసులకి టీం ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram team files a Cybercrime complaint against alleged fake ratings on Book My Show: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ముఖ్యంగా రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోటీ నెలకొంది. ఆ రెండు సినిమాలు మరేమిటో కాదు తేజ హీరోగా నటించిన హనుమాన్, మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం. నిజానికి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాని తొలత జనవరి 13వ తేదీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు కానీ ఎందుకో దాన్ని జనవరి 12కి షిఫ్ట్ చేశారు. అయితే హనుమాన్ సినిమా టీం పది సార్లు వాయిదా వేసుకుంటూ జనవరి 12వ తేదీ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు గుంటూరు కారం టీం కంటే ముందు హనుమాన్ టీం ప్రకటించింది. అయితే ఇద్దరూ వెనక్కి తగ్గడానికి నిరాకరించడంతో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 11వ తేదీన హనుమాన్ సినిమాకి పైడ్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి బుక్ మై షోలో నెగిటివ్ పెయిడ్ క్యాంపెయిన్ జరుగుతోందని సినిమా యూనిట్ భావిస్తోంది.
Chiranjeevi: సంక్రాంతికి సినిమా లేదు కానీ.. మూడు సినిమాల్లో మెగాస్టార్
Also Read
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
ఎందుకంటే సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయితే నాలుగు సినిమాల్లో గుంటూరు కారం సినిమాకి మాత్రమే చాలా తక్కువ రేటింగ్ చూపిస్తోంది. ప్రస్తుతానికి గుంటూరు కారం సినిమాకి బుక్ మై షో లో 6.6 రేటింగ్ మాత్రమే ఉంది. ఇక మరో పక్క హనుమాన్ కి 9.6 ఉండగా సైంధవ్ సినిమాకి 8.5, నా సామిరంగా సినిమాకి 8.1 రేటింగ్స్ ఉన్నాయి. కావాలనే తమ సినిమా మీద పెయిడ్ నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని భావిస్తున్న గుంటూరు కారం సినిమా యూనిట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, రఘుబాబు, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయి మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని ముందు నుంచి సినిమా యూనిట్ భావిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ టీం కి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..