యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల కోసం వేచి చూస్తున్న తరుణంలో ఓటీటీ ఆఫర్ కు ఒకే చేసినట్లు వినిపిస్తోంది. ఈమేరకు ఓ ప్రముఖ ఓటీటీ వేదిక మేకర్స్ సంప్రదింపులు జరిపినట్లు టాక్ నడుస్తోంది. అయితే థియేటర్ల ఓపెనింగ్ ఆలస్యం అవుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథా నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కథ .. స్క్రీన్ ప్లేను అందిస్తున్నది సుకుమార్ కావడం విశేషం.