రావు రమేశ్ కు గీతా ఆర్ట్స్ భారీ రెమ్యూనరేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైన మలయాళ చిత్రం ‘నాయత్తు’ తెలుగు రీమేక్ పై చాలామంది కన్నేశారు. అయితే దాని పునర్ నిర్మాణ హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందనేది అల్లు అరవింద్ నమ్మకం. విశేషం ఏమంటే ఇందులో ఓ కీలక పాత్రకు రావు రమేశ్ ను ఎంపిక చేశారు. మూవీ కథ ఆయన చుట్టూనే తిరుగుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయిన రావు రమేశ్ బల్క్ డేట్స్ సంపాదించడానికి గీతా ఆర్ట్స్ సంస్థ భారీ మొత్తాన్నే పారితోషికంగా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ మూవీకి ఆయన ఏకంగా రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నారని తెలిసింది. ఇందులో మరో రెండు కీలక పాత్రలను శ్రీవిష్ణు, అంజలి పోషించబోతున్నారట. తొలిచిత్రం ‘పలాస’తో మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరుణ కుమార్. ఆయనే ఆ తర్వాత ‘ఆహా’ కోసం ఖదీర్ బాబు రాసిన ‘మెట్రో కథలు’ వెబ్ సీరిస్ చేశారు. కరుణ కుమార్ వర్కింగ్ స్టైల్ నచ్చిన అల్లు అరవింద్ ఇప్పుడు ‘నాయత్తు’ రీమేక్ బాధ్యతలను కూడా ఆయనకే ఇచ్చారట. సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ తెరకెక్కించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 27న జనం ముందుకు రాబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!