రావు రమేశ్ కు గీతా ఆర్ట్స్ భారీ రెమ్యూనరేషన్!
ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైన మలయాళ చిత్రం ‘నాయత్తు’ తెలుగు రీమేక్ పై చాలామంది కన్నేశారు. అయితే దాని పునర్ నిర్మాణ హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందనేది అల్లు అరవింద్ నమ్మకం. విశేషం ఏమంటే ఇందులో ఓ కీలక పాత్రకు రావు రమేశ్ ను ఎంపిక చేశారు. మూవీ కథ ఆయన చుట్టూనే తిరుగుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయిన రావు రమేశ్ బల్క్ డేట్స్ సంపాదించడానికి గీతా ఆర్ట్స్ సంస్థ భారీ మొత్తాన్నే పారితోషికంగా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ మూవీకి ఆయన ఏకంగా రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నారని తెలిసింది. ఇందులో మరో రెండు కీలక పాత్రలను శ్రీవిష్ణు, అంజలి పోషించబోతున్నారట. తొలిచిత్రం ‘పలాస’తో మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కరుణ కుమార్. ఆయనే ఆ తర్వాత ‘ఆహా’ కోసం ఖదీర్ బాబు రాసిన ‘మెట్రో కథలు’ వెబ్ సీరిస్ చేశారు. కరుణ కుమార్ వర్కింగ్ స్టైల్ నచ్చిన అల్లు అరవింద్ ఇప్పుడు ‘నాయత్తు’ రీమేక్ బాధ్యతలను కూడా ఆయనకే ఇచ్చారట. సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ తెరకెక్కించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 27న జనం ముందుకు రాబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!