Krishna : నలభై ఐదేళ్ళ ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్రసీమలో కొన్ని బంధాలు, అనుబంధాలు చూస్తే ఏనాటివో అనిపించక మానదు. హీరో కృష్ణ, నటదర్శకనిర్మాత ఎమ్.బాలయ్య బంధం అలాంటిదే! ఇక కృష్ణ, జయప్రద జోడీ కూడా ప్రత్యేకమైనదే- ఎందుకంటే కృష్ణ సరసన విజయనిర్మల తరువాత అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన క్రెడిట్ జయప్రదకే దక్కింది. ఇలా అనుబంధం ఉన్న వీరి కలయికలో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ అనే చిత్రం తెరకెక్కింది. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. 1977 జూన్ 8న ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ చిత్రం విడుదలయింది.
సింహగిరి రాజాకు పిల్లలు ఉండరు. రెండో భార్య, ఆమె తమ్ముడు ఉండగానే ఆయన గతిస్తారు. చనిపోతూ తన సింహగిరి వారసులు ఎవరైనా కనిపిస్తే, వారికి ఆస్తి చెందాలని వీలునామా రాస్తారు. సంవత్సరంలోగా సింహగిరి వారసులు ఎవరూ దొరక్కపోతే ఆస్తి మొత్తం రెండో భార్యకే చెందుతుందనీ ఆ వీలునామాలో ఉంటుంది. అయితే నిజాయితీగల లాయర్ సింహగిరి వారసుల కోసం వెతికిస్తాడు. ఓ మారుమూల గ్రామంలో సింహగిరి వంశానికి చెందిన సుబ్బయ్యకు తాను రాజావారి మూడోతరం వాడినని తెలుస్తుంది. సింహగిరి రాజావారి లాయర్ దగ్గరకు ఓ కేసు విషయమై వచ్చిన దయాసాగర్ కు ఈ విషయం తెలుస్తుంది. సింహగిరి రాజా వారి ఆస్తి కాజేసేందుకు తన దగ్గర పనిచేసే రంగడిని ఓ జమీందార్ లా తయారు చేసి నాటకమాడిస్తాడు. సుబ్బయ్య కూతురు సీతతో పెళ్ళి జరిగేలా చేస్తాడు. రాజా రెండో భార్య తమ్మునితో కలసి ఓ పథకం వేస్తాడు. అందులో భాగంగా సీతను చంపేస్తే ఆస్తి భర్తకు వస్తుందని, తద్వారా రంగడి నుండి తాము ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చునని భావిస్తారు. రంగడికి ఈ దురాలోచన తెలుస్తుంది. రంగడు అందరికీ దేహశుద్ధి చేసి దోషులను చట్టానికి అప్పగిస్తాడు. రంగడు నిజాయితీగా అందరినీ కలిపి, తానో బజారు మనిషిని బజారులోకి వెళతానని అంటాడు. అతని భార్య సీత అడ్డు పడి తమ బంధం ఈ నాటిది కాదు ఏనాటిదో అని చెప్పి అతణ్ణి ఆపేయడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
- Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
- NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
కృష్ణ, జయప్రద, నాగభూషణం, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, సత్యేంద్రకుమార్, ఎమ్.బాలయ్య, జయలక్ష్మి, రాధాకుమారి, ఝాన్సీ నటించిన ఈచిత్రానికి అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావు నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే బాలయ్య అందించగా, అప్పలాచార్య మాటలు పలికించారు. యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, యమ్.బాలయ్య పాటలు రాశారు. “నారసింహుడొచ్చెను…”, “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకీ…”, “అరె అరె గోతిలో పడ్డాడే…”, “నేననుకున్నది కాదు ఇది…”, “ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది…” అంటూ సాగే పాటలు అలరించాయి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!