‘టక్ జగదీశ్’ను పోస్ట్ పోన్ చేయాలంటున్న ఎగ్జిబిటర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్ జగదీశ్’ను కావాలని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. హీరో నాని, నిర్మాతలు ఈ విషయంలో చొరవ చూపి, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో మాట్లాడి, తమ చిత్రాన్ని మూడు, నాలుగు రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయించాలని కోరారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే… భవిష్యత్తులో ఎగ్జిబిటర్స్ తీసుకునే కఠిన నిర్ణయాలకు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటీటీ సంస్థలు థియేటర్లను మూసివేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఒకసారి అలా జరిగిన తర్వాత నిర్మాతలను తమ ఉక్కు పిడికిలిలోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని, ఈ వాస్తవాన్ని నిర్మాతలు గ్రహించాలని వారు కోరారు.
Read Also : తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
Also Read
- Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ‘నిజానికి ఇది తమ ‘లవ్ స్టోరీ – టక్ జగదీశ్’ చిత్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ప్రతి నిర్మాత సమస్య’ అని అన్నారు. ‘ఒక సినిమా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి థియేటర్లలో విడుదల అవుతుంటే, అదే రోజున మరో సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నిర్మాతలను ఇలా ఇబ్బంది పెట్టే బదులు నాలుగు రోజుల తర్వాత ‘టక్ జగదీశ్’ను ఓటీటీలో విడుదల చేస్తే జరిగే నష్టం ఏమిటని?’ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు పండగ సమయంలో విడుదలవుతున్నప్పుడే ఓటీటీ సంస్థలు తమ దగ్గర ఉన్న సినిమాలను పోటీకి విడుదల చేస్తాయని, అప్పుడు నిర్మాతలకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించాల’ని అన్నారు. సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపలేమని, కాకపోతే పండగల సమయంలో మాత్రం ఓటీటీ కంపెనీలు సినిమాలను స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ‘జెమిని’ కిరణ్ కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, విజయేందర్ రెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. మరి ఈ విషయంలో ‘టక్ జగదీశ్’ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!