కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకెక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.
మార్చి 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలయి పలు వివాదాలకు కారణమయింది. దాంతో వివాదానికి కారణమయిన సీన్స్ తొలగించి ప్రదర్శించారు. కానీ కేరళలో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఎంపురాన్. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ నెల 24న హాట్ స్టార్ ఓ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. థియేటర్స్ లో కేవలం 28 రోజుల రన్ మాత్రమే నడిచిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఓటీటీలో ఇటుంవటి హంగామా చేస్తుందో చూడాలి.