సినీ ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటీనటులు, డైరెక్టర్స్ ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో, వంశీ పైడిపల్లి కోలీవుడ్ లో, అలాగే డైరెక్టర్ లింగుసామి తెలుగులో ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి బాటలో పలువురు దర్శకులు నడుస్తున్నారు. అయితే తాజాగా యంగ్ అండ్ డైనమిక్ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.
Read Also : Will Smith : చెంప దెబ్బ ఎఫెక్ట్ గట్టిగానే… హీరోపై అకాడమీ షాకింగ్ నిర్ణయం
తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టినట్టు సమాచారం. వీటిని టైమ్ ఫిల్మ్స్ NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్తో కలిసి నిర్మించనుంది. తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్లలో ఒకటి ‘జఖీమే’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ ‘తజ్కారి’ అనే వెబ్ సిరీస్. 1980 బ్యాక్డ్రాప్లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. ఇక ప్రస్తుతం తేజ దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసే పనిలో ఉన్నాడు. “అహింస” అనే టైటిల్ తో వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దశలో ఉంది.