వైవిధ్యంతో సాగుతున్న సురేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి.
కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుతూ ఆపేసి, హైదరాబాద్ చేరి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్రాంతికుమార్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. తరువాత సొంతగా ‘అతనొక్కడే’ సబ్జెక్ట్ తయారు చేసుకొని, నందమూరి కళ్యాణ్ రామ్ కు వినిపించారు. కళ్యాణ్ తానే నిర్మాతగా ఆ చిత్రాన్ని నిర్మిస్తూ నటించారు. ఈ చిత్రంలో సురేందర్ రెడ్డి టేకింగ్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
కళ్యాణ్ రామ్ కు తొలి హిట్ గా ‘అతనొక్కడే’ నిలచింది. మొదటి సినిమాతోనే విజయం సాధించిన సురేందర్ కు మంచి అవకాశాలు లభించాయి. రెండవ చిత్రమే జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. జూనియర్ యన్టీఆర్ తో ‘అశోక్’, తరువాత మహేశ్ బాబుతో ‘అతిథి’ రూపొందించారు. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ తెరకెక్కించిన ‘కిక్’ మంచి విజయం సాధించింది. మళ్ళీ జూనియర్ యన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ రూపొందించారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆయన రూపొందించిన ‘రేసు గుర్రం’ బంపర్ హిట్ అయింది.
రవితేజ హీరోగా ‘కిక్-2’ చిత్రాన్ని తన తొలి నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’ ఆధారంగా రామ్ చరణ్ తో ‘ధ్రువ’ రూపొందించారు సురేందర్. ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం కుదిరింది. దాంతో తన తండ్రి చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తోన్న చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’కి సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు రామ్ చరణ్. ‘సైరా…’ రూపకల్పనలో దర్శకునిగా సురేందర్ మంచి మార్కులే సంపాదించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఏ తీరున సురేందర్ రెడ్డి జనాన్ని అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!