వైవిధ్యంతో సాగుతున్న సురేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి.
కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి ఉండేది. డిగ్రీ చదువుతూ ఆపేసి, హైదరాబాద్ చేరి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. క్రాంతికుమార్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. తరువాత సొంతగా ‘అతనొక్కడే’ సబ్జెక్ట్ తయారు చేసుకొని, నందమూరి కళ్యాణ్ రామ్ కు వినిపించారు. కళ్యాణ్ తానే నిర్మాతగా ఆ చిత్రాన్ని నిర్మిస్తూ నటించారు. ఈ చిత్రంలో సురేందర్ రెడ్డి టేకింగ్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Also Read
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
- Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
- Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
కళ్యాణ్ రామ్ కు తొలి హిట్ గా ‘అతనొక్కడే’ నిలచింది. మొదటి సినిమాతోనే విజయం సాధించిన సురేందర్ కు మంచి అవకాశాలు లభించాయి. రెండవ చిత్రమే జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. జూనియర్ యన్టీఆర్ తో ‘అశోక్’, తరువాత మహేశ్ బాబుతో ‘అతిథి’ రూపొందించారు. రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ తెరకెక్కించిన ‘కిక్’ మంచి విజయం సాధించింది. మళ్ళీ జూనియర్ యన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ రూపొందించారు సురేందర్ రెడ్డి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అల్లు అర్జున్ తో ఆయన రూపొందించిన ‘రేసు గుర్రం’ బంపర్ హిట్ అయింది.
రవితేజ హీరోగా ‘కిక్-2’ చిత్రాన్ని తన తొలి నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్’ ఆధారంగా రామ్ చరణ్ తో ‘ధ్రువ’ రూపొందించారు సురేందర్. ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డికి మంచి అనుబంధం కుదిరింది. దాంతో తన తండ్రి చిరంజీవి హీరోగా తాను నిర్మిస్తోన్న చారిత్రక చిత్రం ‘సైరా…నరసింహారెడ్డి’కి సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంచుకున్నారు రామ్ చరణ్. ‘సైరా…’ రూపకల్పనలో దర్శకునిగా సురేందర్ మంచి మార్కులే సంపాదించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఏ తీరున సురేందర్ రెడ్డి జనాన్ని అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!