లావణ్య త్రిపాఠితో రితేష్ రానా కామెడీ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మత్తు వదలారా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రితేష్ రానా కొత్త సినిమాను ఆరంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో జరిగిన పూజతో ఈ మూవీ ఆరంభం అయింది. ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ తొలి షాట్కి దర్శకత్వం వహించారు. గుణ్ణం గంగరాజు కెమెరా స్విచాన్ చేశారు. రాజమౌళి, కొరటాల శివతో పాటు మైత్రి అధినేతలు నవీన్, రవి, చెర్రీ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. మైత్రీ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చెర్రీ,హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈ చిత్రానికి అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ గానుఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబాసాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాల సుబ్రమణ్యం కె.వి.వి వ్యవహరించనున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..