‘తమసోమ జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్ ని చూడగానే తను డైరెక్ట్ చేసిన ‘వేదం’ సినిమా గుర్తుకు వచ్చిందని అంటున్నారు దర్శకుడు క్రిష్. చక్కటి మాటలతో కనివిందు చేసే గ్రామీణ దృశ్యాలతో, చేనేత, చేతి వృత్తులలో యువతలో సామాజిక స్పృహను రేకెత్తించే విధంగా సినిమాని తెరకెక్కించారని అంటున్నారాయన. ట్రైలర్ లో ‘ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు’ ఉందన చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుందని ప్రశంసించారు. ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే నటించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ బడుగు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 29న విడుదల కానుంది. గుణాస్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై తడక రమేష్ ఈ సినిమాను నిర్మించారు. ప్రశాంత్ బిజె సంగీతం అందించిన దీనికి సాయి కార్తీక్ గౌడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.