Gopichand Malineni: మాస్ పల్స్ పట్టేసిన గోపీచంద్ మలినేని
ఈ యేడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఘనత నిస్సందేహంగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కే దక్కుతుంది. జనవరి 12న విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో ఆ ఫీట్ సాధించారు గోపీచంద్. ఈ సంవత్సరం మొదటి రోజున రూ.54 కోట్ల గ్రాస్ ను చూసిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రికార్డ్ సృష్టించింది. తన అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం హీరో కెరీర్ లో ‘టాప్ గ్రాసర్’గా నిలవడం విశేషం! మాస్ ను అలరించే అన్ని అంశాలనూ మేళవించి, గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ని రూపొందించిన తీరు అలరించింది. గోపీచంద్ ఇప్పటి దాకా తీసింది పట్టుమని పది చిత్రాలయినా లేవు. కానీ, యాక్షన్ తో కనికట్టు చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు గోపీచంద్.
శ్రీహరి హీరోగా పరిచయమైన ‘పోలీస్’ సినిమాతోనే గోపీచంద్ మలినేని చలనచిత్ర జీవితం ఆరంభమయింది. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు గోపి. ఆ పై వరుసగా శ్రీహరి హీరోగా నటించిన “దేవా, సాంబయ్య” సినిమాలకూ అసిస్టెంట్ డైరెక్టర్ గానే కొనసాగారు. ఇ.వి.వి. సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగదాస్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ గా, ఛీప్ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన గోపీచంద్ మలినేని , రవితేజ -శ్రియ జంటగా ‘డాన్ శీను’ సినిమా తెరకెక్కిస్తూ దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం బెంగాల్ లో ‘బాద్ షా ద డాన్’గా రీమేక్ అయింది. తొలి చిత్రంతోనే జనానికి వినోదం పంచగలడు అనే పేరు సంపాదించారు గోపి.
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
మళయాళ హిట్ మూవీ ‘బాడీగార్డ్’ ఆధారంగా వెంకటేశ్ తో అదే టైటిల్ తో గోపీచంద్ ఓ సినిమా రూపొందించారు. అది అంతగా ఆకట్టుకోలేక పోయింది. మళ్ళీ రవితేజతో ‘బలుపు’ అనే చిత్రం తెరకెక్కించారు. అది మాస్ ను రంజింపచేసింది. రామ్ తో ‘పండగచేస్కో’, సాయిధరమ్ తో ‘విన్నర్’ సినిమాలు తీసినా, గోపీచంద్ కు భారీ విజయం లభించలేదు. మళ్ళీ తనకు అచ్చి వచ్చిన హీరో రవితేజతో ‘క్రాక్’ రూపొందించారు. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ ఘనవిజయం సాధించింది. దాంతో గోపీచంద్ మలినేనికి క్రేజ్ కూడా పెరిగింది. ‘క్రాక్’తో గోపీచంద్ సాధించిన విజయానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించి, ఆయనను అభినందించారు. తరువాత బాలకృష్ణ వంటి టాప్ స్టార్ తో సినిమా తీసే అవకాశం గోపీచంద్ సొంతమయింది. తత్ఫలితంగా తెరకెక్కిన చిత్రమే ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు తగిన రీతిలో ఈ సినిమాను రూపొందించి అభిమానులను ఎంతగానో మురిపించారు గోపీచంద్. అలాగే ‘వీరసింహారెడ్డి’ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి, గోపీచంద్ ను అభినందించారు. బాలయ్యతో మరో సినిమా తీసే ఛాన్స్ కోసమై గోపీచంద్ ఎదురుచూస్తున్నారు. మరికొందరు మాస్ హీరోలు సైతం గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి తరువాతి సినిమాతో గోపీచంద్ ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!