Gaddar Cine Awards: ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్గా జరిగింది. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాటగిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. మొత్తం 1248 నామినేషన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డిసి) ఛైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, జ్యూరీ సభ్యులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నామినేషన్లను పరిశీలించాలని కోరారు. “తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా జ్యూరీ సభ్యులు వ్యవహరించాలి. ఈ అవార్డుల కోసం ప్రభుత్వం నిష్ణాతులైన వారిని జ్యూరీ సభ్యులుగా నియమించింది,” అని ఆయన అన్నారు.
Raj Tarun : రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య
Also Read
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
- Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
- Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
- Jailer 2 : 'జైలర్ 2' రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
దిల్ రాజు మాట్లాడుతూ, 14 ఏండ్ల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను నిర్వహిస్తుండటం విశేషమని తెలిపారు. “ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదు. ఈసారి భారీ స్థాయిలో నామినేషన్లు రావడం సినీ రంగానికి గర్వకారణం,” అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ తెలుగు సినిమా రంగంలోని ప్రతిభను గుర్తించి, సత్కరించే లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయి. ఈ అవార్డులు చలన చిత్ర నిర్మాణంలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు ఒక వేదికగా నిలుస్తాయని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!