Raj Tarun : రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లో నుంచి గెంటేసిన లావణ్య
- ఇంట్లోకి రానివ్వని లావణ్య
- ఇంటి ముందే కూర్చున్న పేరెంట్స్
- స్పందించని రాజ్ తరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun : హీరో రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూ మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా రాజ్ తరుణ్ పేరెంట్స్ ను లావణ్య ఇంట్లో నుంచి గెంటేయడం సంచలనం రేపుతోంది. కోకాపేటలోని రాజ్ తరుణ్ విల్లాలోకి ఆయన పేరెంట్స్ తాజాగా వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య.. వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది. వారిని బయటకు పంపించేసింది. దీంతో రాజ్ పేరెంట్స్ అదే విల్లా ముందు కూర్చుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ విల్లా తమదే అని వాళ్లు చెబుతున్నారు. ‘రాజ్ తరుణ్ కష్టపడి సినిమాలు చేసిన డబ్బులతో ఈ ఇల్లు కొన్నాడు. ఇందులో లావణ్యకు ఎలాంటి హక్కులు లేవు’ అంటూ వాళ్లు చెబుతున్నారు.
Read Also : Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్కి తమిళ్ స్టార్ హీరో షాక్?
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
ఆ ఇల్లుకు తాను కోటి రూపాయలకు ఇచ్చానంటూ లావణ్య తండ్రి చేసిన వ్యాఖ్యలను రాజ్ పేరెంట్స్ ఖండించారు. ‘ఈ విల్లా రాజ్ తరుణ్ సొంత డబ్బులతో కొన్నాడు. లావణ్య తండ్రి ఒక్క రూపాయ కూడా ఇవ్వలేదు. అతని దగ్గరే డబ్బులు లేవు. అతనెలా ఇస్తాడు. మేం కూడా డబ్బులు ఇవ్వలేదు. రాజ్-లావణ్య మూడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. వారికి పెళ్లి జరగలేదు. ఆ గొడవలు అయినప్పుడే మాకు ఆరోగ్య సమస్యలు వచ్చి ట్రీట్ మెంట్ కోసం బయటకు వెళ్లాం. ఇప్పుడు ఇంటికి వస్తే ఇలా మమ్మల్ని లావణ్య గెంటేసి ఇంట్లో కూర్చుంది. మేం ఇక్కడకు వస్తున్నట్టు రాజ్ తరుణ్ కు తెలియదు. ఈ ఇల్లు మాదే. లావణ్యను ఖాళీ చేయించండి. దయచేసి మాకు న్యాయం చేయండి’ అంటూ చెప్పుకొస్తున్నారు రాజ్ పేరెంట్స్.
ఇక ఇదే విల్లాలో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పావని విల్లాస్ అసోసియేషన్ రాజ్ తరుణ్ కు లేఖ రాసింది. ఇక ఈ వివాదంపై ఇప్పటి వరకు రాజ్ తరుణ్ స్పందించలేదు. ప్రస్తుతం అక్కడకు శేఖర్ భాషా వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ పేరెంట్స్ కు న్యాయం చేసేదాకా తాను అక్కడే ఉంటానని చెబుతున్నాడు. మరోవైపు లావణ్య మాత్రం తనపైనే దాడి చేయడానికి వచ్చారు అంటూ చెబుతోంది. రాజ్ పేరెంట్స్ 15 మందిని తీసుకుని ఇంటికి వచ్చారని.. వారంతా దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..