Dhurandhar 2 : ‘దురంధర్’ వణుకు.. ఎవరిని చూసినా ఇండియన్ ఏజెంట్లే అనిపిస్తోంది.. అఫ్రిది సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు కేవలం వసూళ్ల కోసమే వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు మాత్రం సరిహద్దులు దాటి అవతలి దేశాల వ్యవస్థలనే గడగడలాడిస్తాయి, ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘దురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) పాకిస్థాన్ పునాదులను కదిలించేస్తోంది. ఈ సినిమా దెబ్బకు అక్కడి ప్రముఖులు సైతం భయం భయంగా బతుకుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్కు అద్దం పడుతున్నాయి. ‘దురంధర్ 2’ విడుదలైన తర్వాత పాకిస్థాన్లో ఒకరిపై ఒకరికి నమ్మకం పూర్తిగా పోయిందని ఆయన వాపోయారు. “ప్రస్తుతం పాకిస్థాన్లో పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఎవరితో మాట్లాడాలన్నా వంద సార్లు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా ముందున్న వ్యక్తి ఎప్పుడు ‘ఇండియన్ ఏజెంట్’గా మారిపోతాడో అన్న భయం వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం రోడ్డు పక్కన ఉండే భిక్షగాడి నుండి ఎలైట్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరినీ విచారించాలి. అసలు ఎవరు మనవాళ్లు.. ఎవరు భారత్ ఏజెంట్లు అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.” అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.
Also Read:Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”
Also Read
- Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
- Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
- Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
- Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
ఒకప్పుడు సరిహద్దుల్లో భారత సైన్యం ఇచ్చే దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడేది కానీ ఇప్పుడు ఒక సినిమాతో దర్శకుడు ఆదిత్య ధర్ ఆ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘దురంధర్’ సినిమాలోని కంటెంట్ అక్కడి ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ప్రజల ఆలోచనలను ఎంతలా ప్రభావితం చేసిందో అఫ్రిది మాటలే నిదర్శనం. ఒక ఫిక్షనల్ సినిమా ఇంతటి సంచలనం సృష్టించడం అరుదు. ప్రతి గల్లీలోనూ, ప్రతి ఇంట్లోనూ ఇండియన్ ఏజెంట్లు ఉన్నారనే భ్రమలోకి పాకిస్థానీయులు వెళ్లిపోయారంటే, ఆ సినిమాలో చూపించిన లాజిక్స్, స్క్రీన్ ప్లే ఎంత పక్కాగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ‘దురంధర్’ ఎఫెక్ట్ తో పాకిస్థాన్లో ఇప్పుడు “నమ్మకం” అనే పదమే కరువైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, తుపాకీ గుండు చేయలేని పనిని ఆదిత్య ధర్ తన కెమెరాతో చేసి చూపించారని భారతీయులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?