Dhurandhar 2 : ‘దురంధర్’ వణుకు.. ఎవరిని చూసినా ఇండియన్ ఏజెంట్లే అనిపిస్తోంది.. అఫ్రిది సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు కేవలం వసూళ్ల కోసమే వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు మాత్రం సరిహద్దులు దాటి అవతలి దేశాల వ్యవస్థలనే గడగడలాడిస్తాయి, ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘దురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) పాకిస్థాన్ పునాదులను కదిలించేస్తోంది. ఈ సినిమా దెబ్బకు అక్కడి ప్రముఖులు సైతం భయం భయంగా బతుకుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్కు అద్దం పడుతున్నాయి. ‘దురంధర్ 2’ విడుదలైన తర్వాత పాకిస్థాన్లో ఒకరిపై ఒకరికి నమ్మకం పూర్తిగా పోయిందని ఆయన వాపోయారు. “ప్రస్తుతం పాకిస్థాన్లో పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఎవరితో మాట్లాడాలన్నా వంద సార్లు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నా ముందున్న వ్యక్తి ఎప్పుడు ‘ఇండియన్ ఏజెంట్’గా మారిపోతాడో అన్న భయం వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం రోడ్డు పక్కన ఉండే భిక్షగాడి నుండి ఎలైట్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరినీ విచారించాలి. అసలు ఎవరు మనవాళ్లు.. ఎవరు భారత్ ఏజెంట్లు అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.” అని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.
Also Read:Rakasa: “సెకండాఫ్ అంతా వీఎఫ్ఎక్స్ మాయాజాలమే.. థియేటర్లో ‘రాకాస’ ఒక విజువల్ వండర్!”
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ఒకప్పుడు సరిహద్దుల్లో భారత సైన్యం ఇచ్చే దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడేది కానీ ఇప్పుడు ఒక సినిమాతో దర్శకుడు ఆదిత్య ధర్ ఆ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘దురంధర్’ సినిమాలోని కంటెంట్ అక్కడి ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ప్రజల ఆలోచనలను ఎంతలా ప్రభావితం చేసిందో అఫ్రిది మాటలే నిదర్శనం. ఒక ఫిక్షనల్ సినిమా ఇంతటి సంచలనం సృష్టించడం అరుదు. ప్రతి గల్లీలోనూ, ప్రతి ఇంట్లోనూ ఇండియన్ ఏజెంట్లు ఉన్నారనే భ్రమలోకి పాకిస్థానీయులు వెళ్లిపోయారంటే, ఆ సినిమాలో చూపించిన లాజిక్స్, స్క్రీన్ ప్లే ఎంత పక్కాగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ‘దురంధర్’ ఎఫెక్ట్ తో పాకిస్థాన్లో ఇప్పుడు “నమ్మకం” అనే పదమే కరువైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, తుపాకీ గుండు చేయలేని పనిని ఆదిత్య ధర్ తన కెమెరాతో చేసి చూపించారని భారతీయులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!