Copy Allegations on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసి కంటెంట్ ఉంటే సినిమా చిన్నదైనా ఆదరించడానికి ప్రేక్షకుల మనసు పెద్దది అని కూడా నిరూపించింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా డైరెక్టర్ మారుతితో కలిసి నిర్మాతగా మారిన ఎస్కేఎన్ తెరకెక్కించారు. ఇక ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ కారణంగా బేబీ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్లు ఎస్కేఎన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకున్నది. అంతేకాదు డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్(శ్రీనివాస కుమార్నాయుడు గాదె)పై పోలీసులకు ఒకరు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Allu Arjun: పాదాల నుంచి చేతి వేళ్ళ దాకా.. అల్లు అర్జున్ ఒంటి నిండా ఆ గాయాలేంటి?
సాయి రాజేష్, ఎస్కేఎన్ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని శిరిన్ శ్రీరామ్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్తో స్టోరీ చెప్పానని అన్నారు. నిజానికి 2013లో ఒక సినిమాకి సినిమాటోగ్రాఫర్గా పని చేయాలని సాయి రాజేశ్ తనను కోరినట్లు తెలిపాడు. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని అయితే 2015లో శ్రీరామ్ కన్నా ప్లీజ్ టైటిల్తో ఒక కథ రాసుకుని తరువాత దానికి ప్రేమించొద్దు అనే టైటిల్ మార్చనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కథ సాయిరాజేశ్కు చెబితే బాగుందని చెప్పి ఎస్కేఎన్కు కథను వినిపించమన్నారు. ఆ తరువాత నాకు ఏ మాత్రం చెప్పకుండా 2023లో సాయిరాజేశ్ తన కథతో అదే నిర్మాతతో బేబీ సినిమా తిసినట్లు పేర్కొన్నారు. ఇక బేబీ కథ, నేను రాసుకున్న ప్రేమించొద్దు కథ ఒక్కటేనని శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావస్తూ ఇప్పుడు హిందీలో రీమేక్ కి రెడీ అవుతున్న తరుణంలో ఫిర్యాదు చేయడం కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. ఇక ఈ కాపీ ఆరోపణల నేపథ్యంలో హిందీ రీమేక్ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.