Anchor Kavyasri: యాంకర్ పై వైసీపీ నాయకుడి దాడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Leader Attacked Anchor Kavyasri at Rajamundry: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ చేసే యాంకర్ సహా ఆమె తండ్రిని వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ విచక్షణ రహితంగా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. మీడియా ముందుకు వచ్చిన యాంకర్ కావ్య శ్రీ వైసిపి నాయకుడు ఎన్వీ శ్రీనివాస్ కుమారుడికి 2021లో మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత అనేకసార్లు ఇంటి చుట్టూ తిరిగినా బాకి చెల్లించడం లేదని తెలిపింది. మాజీ ఎంపీ భరత్ అనుచరుడు కావడంతో ఆయన వద్దకు వెళ్లినా న్యాయం జరగలేదని ప్రస్తుతం తనపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ మార్గాని భరత్ జోక్యం చేసుకోవద్దని కావ్య శ్రీ కోరుతోంది. తనపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని యాంకర్ కావ్య శ్రీ డిమాండ్ చేస్తుంది.
Shraddha Kapoor: రిలేషన్లో ప్రభాస్ హీరోయిన్..ఎట్టకేలకు ఒప్పేసుకుంది!
Also Read
- Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
- AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
ఈ విషయం మీద అధికార టీడీపీ ట్విట్టర్ లో స్పందించింది. ‘’దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన జగన్ రెడ్డి సైకో ముఠా, అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజల భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించి అనేక ఇబ్బందులకు గురి చేసిన సైకో జగన్ గ్యాంగ్, తాజాగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగితే వారిపైనే దాడి చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన తండ్రి, కుమార్తెపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. మేము జగన్ రెడ్డి మనుషులం, మమ్మల్నే డబ్బులు అడుగుతారా అంటూ, మహిళ అని కూడా చూడకుండా పిడి గుద్దులు గుద్ది గాయపరిచాడు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.’’ అంటూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
-
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
-
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!