Anchor Kavyasri: యాంకర్ పై వైసీపీ నాయకుడి దాడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Leader Attacked Anchor Kavyasri at Rajamundry: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ చేసే యాంకర్ సహా ఆమె తండ్రిని వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ విచక్షణ రహితంగా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. మీడియా ముందుకు వచ్చిన యాంకర్ కావ్య శ్రీ వైసిపి నాయకుడు ఎన్వీ శ్రీనివాస్ కుమారుడికి 2021లో మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత అనేకసార్లు ఇంటి చుట్టూ తిరిగినా బాకి చెల్లించడం లేదని తెలిపింది. మాజీ ఎంపీ భరత్ అనుచరుడు కావడంతో ఆయన వద్దకు వెళ్లినా న్యాయం జరగలేదని ప్రస్తుతం తనపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ మార్గాని భరత్ జోక్యం చేసుకోవద్దని కావ్య శ్రీ కోరుతోంది. తనపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని యాంకర్ కావ్య శ్రీ డిమాండ్ చేస్తుంది.
Shraddha Kapoor: రిలేషన్లో ప్రభాస్ హీరోయిన్..ఎట్టకేలకు ఒప్పేసుకుంది!
Also Read
- KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
- NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ఈ విషయం మీద అధికార టీడీపీ ట్విట్టర్ లో స్పందించింది. ‘’దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన జగన్ రెడ్డి సైకో ముఠా, అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజల భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించి అనేక ఇబ్బందులకు గురి చేసిన సైకో జగన్ గ్యాంగ్, తాజాగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగితే వారిపైనే దాడి చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన తండ్రి, కుమార్తెపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. మేము జగన్ రెడ్డి మనుషులం, మమ్మల్నే డబ్బులు అడుగుతారా అంటూ, మహిళ అని కూడా చూడకుండా పిడి గుద్దులు గుద్ది గాయపరిచాడు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.’’ అంటూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!