Anchor Kavyasri: యాంకర్ పై వైసీపీ నాయకుడి దాడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Leader Attacked Anchor Kavyasri at Rajamundry: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్ పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. 3 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కావ్య శ్రీ అనే ఈవెంట్స్ చేసే యాంకర్ సహా ఆమె తండ్రిని వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్ వి శ్రీనివాస్ విచక్షణ రహితంగా కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. మీడియా ముందుకు వచ్చిన యాంకర్ కావ్య శ్రీ వైసిపి నాయకుడు ఎన్వీ శ్రీనివాస్ కుమారుడికి 2021లో మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత అనేకసార్లు ఇంటి చుట్టూ తిరిగినా బాకి చెల్లించడం లేదని తెలిపింది. మాజీ ఎంపీ భరత్ అనుచరుడు కావడంతో ఆయన వద్దకు వెళ్లినా న్యాయం జరగలేదని ప్రస్తుతం తనపై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ మార్గాని భరత్ జోక్యం చేసుకోవద్దని కావ్య శ్రీ కోరుతోంది. తనపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని యాంకర్ కావ్య శ్రీ డిమాండ్ చేస్తుంది.
Shraddha Kapoor: రిలేషన్లో ప్రభాస్ హీరోయిన్..ఎట్టకేలకు ఒప్పేసుకుంది!
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
ఈ విషయం మీద అధికార టీడీపీ ట్విట్టర్ లో స్పందించింది. ‘’దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన జగన్ రెడ్డి సైకో ముఠా, అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజల భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించి అనేక ఇబ్బందులకు గురి చేసిన సైకో జగన్ గ్యాంగ్, తాజాగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగితే వారిపైనే దాడి చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన తండ్రి, కుమార్తెపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు శ్రీనివాస్ దాడికి పాల్పడ్డాడు. మేము జగన్ రెడ్డి మనుషులం, మమ్మల్నే డబ్బులు అడుగుతారా అంటూ, మహిళ అని కూడా చూడకుండా పిడి గుద్దులు గుద్ది గాయపరిచాడు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.’’ అంటూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!