యష్ మంచి మనసు… ఆ 3000 మంది అకౌంట్లలోకి రూ.5000…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ జనజీవనంపైనే కాకుండా సినిమా ఇండస్ట్రీపై భారీగానే పడింది. దీంతో సినీ కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు బంద్ కావడంతో వారికి పని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కేజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన 21 డిపార్టుమెంటులలో పనిచేసే 3000 మంది అకౌంట్లలోకి రూ.5000 ట్రాన్స్ఫర్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. “కంటికి కన్పించని కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది, చాలామందికి ఎంతో నష్టాన్ని కలిగించింది. నా సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ సినిమా పరిశ్రమ కూడా ఎంతగానో నష్టపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నా సంపాదనలో నుంచి సినిమా ఇండస్ట్రీకి చెందిన 21 డిపార్టుమెంటులలో పనిచేసే 3000 మంది అకౌంట్లలోకి రూ.5000 ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో కలిగిన నష్టానికి, బాధకు ఇది పరిష్కారం కాదని నాకు బాగా తెలుసు. కానీ ఇదొక ఆశాకిరణం…” అంటూ ట్వీట్ చేశారు. ఆయన మంచి మనసుకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!