డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్ట్స్ సినిమా విషయంలో అనిల్ ఇచ్చే అప్డేట్స్ కంటే.. సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి వస్తానని ఆయన జస్ట్ హింట్ ఇచ్చాడంతే. ఇంకేముంది నెట్టింట కథలు కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో స్వయంగా అనిలే అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్, ఫస్ట్ హండ్రెడ్ కోర్ అందించిన వెంకటేష్తో కొలాబరేట్ అవుతున్నానని ఎనౌన్స్ చేశారు.
అనిల్ రావిపూడి కొత్త సినిమాలో హీరోలు ఎవరో తేలిపోయారు. ఇక వీరికి హీరోయిన్స్ చాయిస్ చెప్పాలిగా. ఈ ఛాన్స్ కూడా అనిల్కు ఇవ్వకుండానే సోషల్ మీడియాలో ఈ భామలు ఫిక్స్ అయ్యారంటూ వార్తలొచ్చేస్తున్నాయి. వెంకటేష్కు జోడీగా మహానటి కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్కు పెయిర్గా బేబమ్మ కృతి శెట్టిని ఫిక్స్ చేశారు నెటిజెన్స్. ఏప్రిల్ నుంచే షూట్ మొదలు కావాల్సి ఉన్నా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో జూన్లో స్టార్ట్ కానుందని, ఈ మూవీ 2027 పొంగల్ను టార్గెట్ చేయబోతుందని తెలుస్తోంది. వెంకీ, కళ్యాణ్ రామ్లకు కీర్తి, కృతిని తెస్తాడో లేదో అనిల్ అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. ఈ ఇద్దరు ఫిక్సైతే మాత్రం ఫామ్ కోల్పోయిన భామలు సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే.
దసరా తర్వాత కీర్తి సురేష్ నటించిన ఏ ఫిల్మ్ హిట్ కాలేదు. తెలుగు, తమిళ్, హిందీలో చక్కర్లు కొడుతున్నా.. సక్సెస్ టెస్ట్ ఇంకా తగలలేదు. భోళా శంకర్లో చిరంజీవి చెల్లిగా నటించిన కీర్తి.. మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. ప్రస్తుతం ‘రౌడీ జనార్థనా’ ఒక్కటే ఆమె చేతిలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్. ఇక ఉప్పెనతో బేబమ్మగా రిజిస్టరైన కృతి శెట్టి అప్పుడెప్పుడో వచ్చిన బంగ్రారాజుతో హిట్ టెస్ట్ చూసింది. అక్కడ నుంచి వరుస డిజాస్టర్సే. తెలుగులో కూడా ఆఫర్స్ పూర్తిగా నిల్. ఈ టైంలో అనిల్ నుంచి ఛాన్స్ వచ్చిందంటే.. మళ్లీ ఇక్కడ కెరీర్ పుంజుకున్నట్లే. ఈ వార్తలు నిజమైతే.. కీర్తి, కృతిల ఖాతాలో సక్సెస్ పడినట్లే. ఎందుకంటే.. అక్కడ సినిమా తీస్తుంది అనిల్. అనిల్ అంటేనే సక్సెస్.. సక్సెస్ అంటేనే అనిల్ అని టాలీవుడ్లో ఓ ముద్ర పడిపోయింది.
