జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “కానిస్టేబుల్”.ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో AAA మల్టీ ప్లెక్స్ థియటర్ లో ఘనంగా జరిగింది.. సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా డా: రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో నేను కూడా పోలీస్ పాత్రలు చేశాను. అయితే ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సీరియస్ నెస్ సాగేవి. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా తన పాత్రలో ఒదిగి పోయి ఉంటాడని భావిస్తున్నానని అన్నారు.
Also Read : Anushka: శీలావతిగా అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం
అతిధులు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి లు మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమాలకు నేడు అధిక ప్రాధాన్య ఉంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకే భ్రహ్మరథం పడుతున్నారు. పోలీస్ వారు మన భద్రతకు అహర్నిశలు ఎంత శ్రమ పడుతున్నారో మనకు తెలిసిందే. అలాంటి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..నాకు ఇప్పటి వరకు లవర్ బాయ్ గా పేరు ఉంది. అయినప్పటికీ విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకొని నటించడాని ప్రయత్నిస్తున్నాను. ఈ కథను డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ నాకు చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ ను ఊహించుకొని చెయ్యగలననే నమ్మకం ఏర్పడిన తరువాత ఈ సినిమా చెయ్యడం జరిగింది. సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం కలిగింది. తప్పకుండా మా అంచనాలను నిలబెదుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.