Upendra : ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ‘45’ టీజర్ లాంఛ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. దీంతో రీసెంట్గా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ టీం అంత పాల్గోన్ని మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ..
Also Read: Vijayashanti : పవన్ సతీమణి మీద వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన విజయశాంతి..
Also Read
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
- Bhagyanagaramlo Sarathi Prema: ఆకట్టుకుంటున్న లవ్ ఎమోషనల్ డ్రామా
‘ ‘45’ మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు అర్జున్ జన్యా. శివరాజ్ కుమార్ గారితో ఓం సినిమా రూపొందించాను. ఆ సినిమా షూటింగ్ రెండో రోజే నేను గొప్ప దర్శకుడిని అవుతానని మీడియా ముందు చెప్పారు. శివన్న అలా చెప్పడం చూసి నేను కంగారుపడ్డాను. లేదు నువ్వు దర్శకుడిగా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పారు. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఏంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని’ అని తెలిపారు. అనంతరం దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ..
‘శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో ‘45’ మూవీని చేయడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారికి ఆరోగ్యం బాగా లేకున్నా, ఎంతో సపోర్ట్ చేసి సినిమాలో నటించారు. ఉపేంద్ర గారిని ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు. 45 మూవీని ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎం తో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు , ప్రొడ్యూసర్స్కు బడ్జెట్ ఆదా అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా గొప్ప దర్శకులు ఉన్నారు. వారు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనంతో ఉండే చిత్రమిది. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!