Tollywood : బాలీవుడ్ ‘విలన్స్’ కు ‘బెస్ట్ ఫ్రెండ్’ గా మారుతున్న టాలీవుడ్.. మ్యాటర్ ఏంటంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే సల్మాన్, సంజయ్ దత్, బాబీడియోల్, అర్జున్ రామ్ పాల్, వివేక్ ఓబెరాయ్, సైఫ్ అలీఖాన్ టాలీవుడ్లో మెరిస్తే.. ఈ జాబితాలోకి చేరారు మరికొందరు.
Also Read : RT 76 : టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
Also Read
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
బాలీవుడ్ రొమాంటిక్ హీరో లిప్ కిసెస్కు బ్రాండ్ అంబాసిడరైన ఇమ్రాన్ హష్మీ బీటౌన్లో మార్కెట్ కోల్పోతున్నాడు. ఆయన వెనుకొచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరోలు ఇంటిమేట్ సీన్లలో ఈయనకంటే రెచ్చిపోతుంటే ఇమ్రాన్ను పట్టించుకునేదెవరు. యాక్షన్ వైపు టర్న్ తీసుకున్నా ఎవరు చూడలేదు. అందుకే టాలీవుడ్ నుండి యాంటోగనిస్టుగా ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఓజాస్ గంభీరతో ఓమీగా తలపడబోతున్నాడు. సెప్టెంబర్ 25న ఆగమనమౌతున్న ఓజీతో మన టాలీవుడ్కు కొత్త విలన్ దొరికేసినట్లే. గూఢచారి2లో అడవి శేష్తో ఢీకొట్టబోతున్నాడు హష్మీ. ఇక బాలీవుడ్కు బై బై చెప్పి సౌత్ సినిమాలపై ఇంప్రెషన్ పెంచుకున్న స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అడివి శేష్ హీరోగా నటిస్తోన్న డెకాయిట్తో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మీర్జాపూర్ సిరీస్తో మున్నాభాయ్గా క్రేజ్ సంపాదించుకున్న దివ్యేందు శర్మ కూడా టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఆఫర్ కొల్లగొట్టాడు. పెద్దిలో రామ్ చరణ్తో తలపడబోతున్నాడు. నాగ చైతన్య 24లో లాపతా లేడీస్ హీరో స్పర్శ్ శ్రీవాత్సవ్, మహాకాళితో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ కు టాలీవుడ్ ఒక దారి చూపిస్తోంది.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!