NTV Telugu Site icon

Tollywood : మైత్రీ మూవీస్ తో చేతులు కలిపిన బాలీవుడ్ నిర్మాణ సంస్థ..?

Mythri

Mythri

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న బ్యానర్ ఏదైనా ఉందంటే అది మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప -2, రేవాల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తోంది కూడా మైత్రీ నిర్మాతలే. అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ తో చేస్తోన్న డ్రాగన్ ను కూడా మైత్రీ వాల్లే నిర్మిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు అన్ని మైత్రీ చేతిలో ఉన్నాయి.

Also Read : OG : ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..

తెలుగు సినిమాలు ఇప్పుడు హిందీలో అక్కడి స్టార్ హీరోల సినిమాలను దాటి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు తెలుగు స్టార్ హీరోల మీద కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో చేతులు కలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇప్పటికే  అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డికి చెందిన భద్రకాళి ప్రోడాక్టన్స్ తో సంయుక్త నిర్మాణంలో ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మైత్రీతో T-సిరీస్ లాంగ్ టర్మ్ ఒప్పదం చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ నిర్మించే గుడ్ బ్యాడ్ అగ్లీ లోను T-సిరీస్ భాగస్వామ్యంగా వ్యవహరించడంతో పాటు ఆడియో రైట్స్ ను కొనుగోలు చేసాడు భూషణ్ కుమార్. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను కూడా T-సిరీస్ నిర్మించింది  .