ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై చిత్ర బృందం అధికారకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజాగా వినిపిస్తిన్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చకచక జరుగుతున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టు మహేశ్ బాబు తన లుక్ ను మార్చే పనిలో ఉన్నారు. ఇటీవల అంబానీ వివాహానికి హాజరయిన మహేశ్ లుక్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లాంగ్ హెయిర్ తో మైండ్ బ్లోయింగ్ లుక్ లో మహేష్ బాబు అదరగొట్టాడు.
కాగా వినిపిస్తున్న సమాచారం మేరకు రాజమౌళి, మహేశ్ బాబుల చిత్రానికి సంబంధించి ఇంట్రెస్ట్ న్యూస్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ అంచనాలను అనుకోవడం అంత ఈజీ కాదు. బంగారం లాంటి మహేశ్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తపై రాజమౌళి టీమ్ ప్రకటన చేస్తారేమో చూడాలి.
Also Read :Kalki: కల్కి అన్ స్టాపబుల్ ..అన్ బీటబుల్ రికార్డ్స్..మెుత్తం ఎన్ని కోట్లంటే..?