Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ నుండి 72 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : Akhanda 2: అఖండ 2 తాండవం ఆడించే ఓటీటీ ఫిక్స్?
Also Read
- Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
- Naga Vamsi: 'పెద్ది' కోసమే సైలెంట్ అయ్యా.. లేదంటే కావాలనే చేశాననేవారు.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!
- AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
- Babu Mohan: 15 సినిమాల్లో నటిస్తున్నా.. డ్యాన్స్లు కూడా చేశా.. బాబు మోహన్ ఆసక్తికర విషయాలు!
ఈ క్రమంలో అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, “నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలను విధిస్తూ, కార్మికుల పట్ల అన్యాయం చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో, కార్మికులు తమ సమస్యలను చిరంజీవికి వివరించారు. “మేము రెండు కండీషన్స్కు ఒప్పుకుంటే ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటామో చిరంజీవి గారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ విషయంలో కూడా మా అభిప్రాయం విన్నవించుకున్నాం. అలాగే, మా మీద వచ్చిన నిందలను కూడా స్పష్టంగా చెప్పుకున్నాం,” అని అనిల్ తెలిపారు. ఈ సమావేశంలో చిరంజీవి కార్మికులకు భరోసా ఇచ్చారు.
Also Read : Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
“మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి. మీ సమస్యలను న్యాయంగా పరిష్కరించేందుకు సహకరిస్తాను,” అని చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత, కార్మికులు తమ నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని అనిల్ వల్లభనేని ప్రకటించారు. మరోవైపు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి కూడా కార్మిక సంఘానికి చర్చలకు పిలుపు వచ్చింది. రేపు (ఆగస్టు 19, 2025) జనరల్ బాడీ మీటింగ్తో పాటు ఛాంబర్తో సమావేశం జరగనుంది. “చర్చలకు పిలిచారు కాబట్టి, మేము నిరసన కార్యక్రమాన్ని ఆపాము. మేము అడిగిన వేతన పెంపు జరుగుతుందని ఆశిస్తున్నాం,” అని అనిల్ వల్లభనేని ఆశాభావం వ్యక్తం చేశారు. “చిరంజీవి గారు, బాలయ్య గారు మా సమస్య పరిష్కారం కోసమే మాట్లాడతారు. వారు ఎవరి వైపూ పక్షపాతం చూపరు,” అని అనిల్ తెలిపారు.
తాజావార్తలు
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
-
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!