Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. ఈ రోజు (ఆగస్టు 18, 2025) చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ నుండి 72 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : Akhanda 2: అఖండ 2 తాండవం ఆడించే ఓటీటీ ఫిక్స్?
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
ఈ క్రమంలో అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, “నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలను విధిస్తూ, కార్మికుల పట్ల అన్యాయం చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో, కార్మికులు తమ సమస్యలను చిరంజీవికి వివరించారు. “మేము రెండు కండీషన్స్కు ఒప్పుకుంటే ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటామో చిరంజీవి గారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ విషయంలో కూడా మా అభిప్రాయం విన్నవించుకున్నాం. అలాగే, మా మీద వచ్చిన నిందలను కూడా స్పష్టంగా చెప్పుకున్నాం,” అని అనిల్ తెలిపారు. ఈ సమావేశంలో చిరంజీవి కార్మికులకు భరోసా ఇచ్చారు.
Also Read : Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
“మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి. మీ సమస్యలను న్యాయంగా పరిష్కరించేందుకు సహకరిస్తాను,” అని చిరంజీవి హామీ ఇచ్చారు. ఈ సమావేశం తర్వాత, కార్మికులు తమ నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని అనిల్ వల్లభనేని ప్రకటించారు. మరోవైపు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి కూడా కార్మిక సంఘానికి చర్చలకు పిలుపు వచ్చింది. రేపు (ఆగస్టు 19, 2025) జనరల్ బాడీ మీటింగ్తో పాటు ఛాంబర్తో సమావేశం జరగనుంది. “చర్చలకు పిలిచారు కాబట్టి, మేము నిరసన కార్యక్రమాన్ని ఆపాము. మేము అడిగిన వేతన పెంపు జరుగుతుందని ఆశిస్తున్నాం,” అని అనిల్ వల్లభనేని ఆశాభావం వ్యక్తం చేశారు. “చిరంజీవి గారు, బాలయ్య గారు మా సమస్య పరిష్కారం కోసమే మాట్లాడతారు. వారు ఎవరి వైపూ పక్షపాతం చూపరు,” అని అనిల్ తెలిపారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..