Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya48 : భాషకు అతీతంగా అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. కోలీవుడ్ స్టార్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోకి తెలుగులో కూడా ఆ రేంజ్లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హీరో సూర్య తిరుగులేని ఫామ్లో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారాయన. ఈ మాస్ కమర్షియల్ సక్సెస్ జోష్లో ఉండగానే, సూర్య తన అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వినిపిస్తుంది. తన 48వ ప్రాజెక్ట్ (#Suriya48) కోసం కల్ట్ క్లాసిక్ ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్తో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
‘కరుప్పు’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య, తన నెక్ట్స్ మూవీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (VAS) చేస్తున్న సంగతి తెలిసిందే, దీని తర్వాత జితు మాధవన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సూర్య 47’ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్గా చేస్తున్నారని సమాచారం. ఈ మూడు చిత్రాల తర్వాత సూర్య మళ్లీ తన మార్క్ సోషల్ డ్రామా వైపు అడుగులు వేస్తున్నారని ప్రస్తుతం కోలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ ఓటీటీ వేదికగా విడుదలై, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించడమే కాకుండా న్యాయవ్యవస్థపై బలమైన ఇంపాక్ట్ చూపించిన విషయం తెలిసిందే.
Also Read
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
ప్రస్తుతం వీరిద్దరి కాంబో తెరకెక్కబోతున్నట్లు జరుగుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒక పవర్ఫుల్ రియల్ లైఫ్ బయోపిక్ అని తెలుస్తోంది. సమాజంలోని ఒక కీలకమైన సామాజిక అంశాన్ని బేస్ చేసుకుని జ్ఞానవేల్ ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. అయితే ఇది ‘జై భీమ్’ లేదా రీసెంట్గా రజనీకాంత్తో తీసిన ‘వేట్టయాన్’ లాగా పోలీస్ లేదా కోర్టు రూమ్ డ్రామా బ్యాక్డ్రాప్ కాదని, సరికొత్త కాన్సెప్ట్తో ఉండబోతోందని సమాచారం. తన జర్నలిజం కెరీర్లో తారసపడిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ ఈ కథను రాసుకున్నారట. ఈ చిత్రాన్ని సూర్య హోమ్ బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతుందట. ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన ఫైనల్ నరేషన్కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం లైన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా చివర్లో ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. 2027 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్ అని చెబుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!